Simhachalam Chandanotsavam 2026 : విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామి వారి చందనోత్సవానికి సర్వం సిద్ధమైంది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 20వ తేదీన స్వామి వారు భక్తులకు నిజరూపంలో దర్శనమివ్వనున్నారు.
ఏడాదిలో ఒక్కసారి మాత్రమే…!

ఏడాది పొడవునా సుమారు 500 కిలోల చందన లేపనంలో ఒదిగి ఉండే సింహాద్రి అప్పన్న, కేవలం వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే ఆ చందనాన్ని తొలగించి తన అసలు రూపంలో భక్తులకు సాక్షాత్కరిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలిరానున్నారు.
సింహాద్రి అప్పన్న స్వామి వారిని ఏడాది పొడవునా చందన ముద్దతో కప్పబడిన లింగ రూపంలోనే భక్తులు దర్శించుకుంటారు. అయితే అక్షయ తృతీయ నాడు నిర్వహించే చందనోత్సవం అత్యంత విశిష్టమైనది. స్వామి వారి దేహంపై ఉన్న చందనాన్ని శాస్త్రోక్తంగా ఒలిచి…. కేవలం ఈ ఒక్క రోజే ఆయన నిజరూపాన్ని ప్రదర్శిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, నీడ, తాగునీరు వంటి కనీస వసతులను సిద్ధం చేశారు.
దర్శనం టైమింగ్స్:
- ఏప్రిల్ 20వ తేదీ వేకువజాము నుంచే ఆలయంలో వైదిక క్రతువులు ప్రారంభం కానున్నాయి.
- వేకువజామున 1:00 గంటలకు ఆలయంలో స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
- 1:00 నుంచి 3:00 గంటల వరకు: శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు, స్వామి దేహంపై నుంచి చందనం ఒలుపు క్రతువు నిర్వహిస్తారు.
- ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు మరియు వారి కుటుంబ సభ్యులకు స్వామి వారి తొలి దర్శనం కల్పిస్తారు.
- ఉదయం 3:30 గంటలకు: సామాన్య భక్తులను దర్శనాల కోసం క్యూలైన్లలోకి అనుమతిస్తారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనాల విషయంలో అధికారులు స్పష్టమైన గడువును నిర్ణయించారు. రాత్రి 7 గంటలకు అన్ని క్యూలైన్ల ప్రవేశ మార్గాలను అధికారులు మూసివేస్తారు. అయితే అప్పటికే క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులందరికీ రాత్రి 11 గంటల వరకు స్వామి వారి నిజరూప దర్శనం కల్పించనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. భక్తుల రక్షణ కోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సింహాచలం కొండపైకి వెళ్లే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.
{{/usCountry}}భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనాల విషయంలో అధికారులు స్పష్టమైన గడువును నిర్ణయించారు. రాత్రి 7 గంటలకు అన్ని క్యూలైన్ల ప్రవేశ మార్గాలను అధికారులు మూసివేస్తారు. అయితే అప్పటికే క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులందరికీ రాత్రి 11 గంటల వరకు స్వామి వారి నిజరూప దర్శనం కల్పించనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. భక్తుల రక్షణ కోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సింహాచలం కొండపైకి వెళ్లే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.
{{/usCountry}}