శ్రావణ అమావాస్య నాడు ఈ 3 పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు, సిరి సంపదలు!
శ్రావణ మాసంలోని అమావాస్యను పితృదేవతల ఆరాధనకు పవిత్రమైన రోజుగా భావిస్తారు. 2026లో ఈ అమావాస్య సెప్టెంబర్ 10 ఉదయం 10:33 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 11 ఉదయం 8:56 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం సెప్టెంబర్ 11న పూజలు, దానధర్మాలు చేయడం శ్రేయస్కరమని ఈ కథనం పేర్కొంటోంది.
హిందూ ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసంలో వచ్చే అమావాస్య తిథి పితృ దేవతల ఆరాధనకు, పూర్వీకుల రుణం తీర్చుకోవడానికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది శ్రావణ అమావాస్య రెండు రోజుల పాటు రానుంది.

సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 10:33 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 11 ఉదయం 8:56 గంటలకు ఈ తిథి ముగుస్తుంది. అయితే ఉదయ తిథి ప్రకారం సెప్టెంబర్ 11నే పూజా కార్యక్రమాలు, దానధర్మాలు నిర్వహించడం శ్రేయస్కరం. ఈ పవిత్ర రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం ద్వారా జీవితంలోని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, కుటుంబంలో సిరిసందపలు వర్ధిల్లుతాయని విశ్వసిస్తారు.
ఆర్థిక ప్రగతికి తులసి జపం
డబ్బు సమస్యలతో సతమతమవుతున్నవారు భద్రపద అమావాస్య రోజున తులసి మాల సహాయంతో 108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించాలి. ఇది ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని తొలగించి సానుకూల వాతావరణాన్ని తీసుకొస్తుంది. అలాగే ఈ రోజున పితృస్తోత్రం, పితృ కవచం పఠించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభించి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. మూగజీవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ హింసించకూడదు, వీలైనంతగా ఆవులకు సేవ చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపారాధన
ధనలక్ష్మి కటాక్షం కోసం పూజా సమయంలో వెలిగించే ఆవు నెయ్యి దీపంలో కొద్దిగా కుంకుమ, రెండు లవంగాలు వేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఇక ఉదయాన్నే రావి చెట్టుకు నీరు సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. పితృ దోషాల నుంచి విముక్తి పొందడానికి సాయంత్రం వేళ రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం అత్యంత శుభప్రదం.
ఇంటి శుభ్రత - దాన ధర్మాలు
ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమికొట్టడానికి అమావాస్య రోజున ఇంటిని శుభ్రపరిచేటప్పుడు నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఇల్లు తుడవాలి. ఈ రోజున పేదలకు అన్నదానం, వస్త్రదానం, ఫలదానం చేయడం ద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇంటికి దక్షిణ దిశలో ఆవనూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించాలి. ఇంటి ఈశాన్య మూలన ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరం వెలిగేలా ఆవు నెయ్యి దీపాన్ని ఉంచడం వల్ల సానుకూల స్పందనలు పెరిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారంపై, అవి పూర్తిగా నిజమైనవి మరియు ఖచ్చితమైనవి అని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడి సలహా తీసుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


