శ్రీకృష్ణ జన్మాష్టమి: నేడు దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం సంకల్పం నుంచి అర్ధరాత్రి జరిగే లడ్డూ గోపాలుడి అభిషేకం వరకు రోజంతా పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

భారతీయ సంస్కృతిలో శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే ఈ పర్వదినం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కృష్ణాష్టమి రోజు కేవలం అర్ధరాత్రి పూజ మాత్రమే కాకుండా, తెల్లవారుజాము నుంచే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఇళ్లన్నీ గోకులాలను తలపిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోతాయి.
ఉదయం పూట చేయాల్సిన ఏర్పాట్లు
పండుగ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
ఇంటిలోని పూజా మందిరాన్ని శుభ్రం చేసి దీపం వెలిగించాలి.
రోజంతా ఉపవాసం ఉండాలని భావించేవారు దేవుడి ముందు ప్రత్యేకంగా సంకల్పం చెప్పుకోవాలి.
పూజకు అవసరమైన ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో పాటు తులసి దళాలు, పండ్లు, తాజా వెన్న, మిశ్రి వంటి పూజా సామగ్రిని ఉదయమే సిద్ధం చేసుకోవాలి.
మధ్యాహ్నం నాటికి సిద్దం కావాల్సిన ఏర్పాట్లు
కృష్ణాష్టమి వేడుకల్లో బాలా గోపాలుడికి ఊయల కట్టడం అత్యంత ప్రధానమైన ఘట్టం. మధ్యాహ్నానికల్లా ఉయ్యాలను పూలు, అందమైన వస్త్రాలతో అలంకరించి సిద్ధం చేయాలి. లడ్డూ గోపాలుడికి నూతన వస్త్రాలు ధరించి దివ్యమైన అలంకరణ చేయాలి. భక్తులు తమ తీరికను బట్టి రోజంతా కృష్ణ నామస్మరణ, భజనలు లేదా భగవద్గీత పఠనం చేయడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
శ్రీకృష్ణ జన్మాష్టమి రాత్రి పూజా సమయం - నిషిత కాల ముహూర్తం
నేడు రాత్రి 11:57 గంటల నుంచి తెల్లవారుజామున 12:43 గంటల వరకు నిశిత కాల పూజా ముహూర్తం ఉంది. సరిగ్గా రాత్రి 12 గంటల సమయానికి శ్రీకృష్ణుడి జననం జరగనుండటంతో దేశవ్యాప్తంగా దేవాలయాలు, ఇళ్లలో ప్రత్యేక పూజలు ఊపందుకుంటాయి. అర్ధరాత్రి వేళ లడ్డూ గోపాలుడికి పంచామృతాలతో అభిషేకం చేసి, కొత్త బట్టలు అలంకరించి, తులసి దళాలు సమర్పిస్తారు. వెన్న, మిశ్రి నైవేద్యంగా పెట్టి శంఖారావాలు, గంటల మోతల మధ్య హారతి ఇస్తారు. అనంతరం బాల గోపాలుడిని ఉయ్యాలలో ఊపుతూ సంబరాలు చేసుకుంటారు.
{{/usCountry}}నేడు రాత్రి 11:57 గంటల నుంచి తెల్లవారుజామున 12:43 గంటల వరకు నిశిత కాల పూజా ముహూర్తం ఉంది. సరిగ్గా రాత్రి 12 గంటల సమయానికి శ్రీకృష్ణుడి జననం జరగనుండటంతో దేశవ్యాప్తంగా దేవాలయాలు, ఇళ్లలో ప్రత్యేక పూజలు ఊపందుకుంటాయి. అర్ధరాత్రి వేళ లడ్డూ గోపాలుడికి పంచామృతాలతో అభిషేకం చేసి, కొత్త బట్టలు అలంకరించి, తులసి దళాలు సమర్పిస్తారు. వెన్న, మిశ్రి నైవేద్యంగా పెట్టి శంఖారావాలు, గంటల మోతల మధ్య హారతి ఇస్తారు. అనంతరం బాల గోపాలుడిని ఉయ్యాలలో ఊపుతూ సంబరాలు చేసుకుంటారు.
{{/usCountry}}నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారంపై, అవి పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనవి అని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.