వృషభ రాశిలోకి సూర్యుడి ఆగమనం - రేపట్నుంచి ఈ 6 రాశులకు అదృష్టం వరించబోతోంది!
మే 15న సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మార్పుతో….. మేషం, వృషభం, కర్కాటకంతో సహా పలు రాశుల వారికి కెరీర్, ఆదాయం, సామాజిక హోదాలో అద్భుతమైన మార్పులు రానున్నాయి.
Sun Transit Taurus 2026: ఖగోళ మార్పుల్లో అత్యంత కీలకమైన 'సూర్య సంచారం' మే 15వ తేదీ ఉదయం జరగనుంది. గ్రహాలకు రాజుగా భావించే సూర్య భగవానుడు మేష రాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం… సూర్యుడు ఆత్మవిశ్వాసం, అధికారం, ఉద్యోగం, విజయానికి కారకుడు. వృషభ రాశిలోకి సూర్యుడి ప్రవేశం వల్ల సమాజంలో వ్యక్తుల దృష్టి ప్రధానంగా ఆర్థికాభివృద్ధి, కుటుంబ సంక్షేమం మరియు భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్రీకృతమవుతుంది. ఈ కాలంలో ప్రజలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా…. ఆచితూచి అడుగులు వేయడానికి మొగ్గు చూపుతారు. ముఖ్యంగా ఆరు రాశుల వారికి ఈ సంచారం రాజయోగంలా మారబోతోంది.
ఏ రాశికి ఎలా ఉండబోతోంది…?
- మేష రాశి : ఆర్థిక పరంగా మేష రాశి వారికి ఇది స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆదాయం పెరగడమే కాకుండా…. నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభాల పంట పండుతుంది.
- వృషభ రాశి : సూర్యుడు మీ స్వంత రాశిలోకి వస్తున్నందున…. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి శుభవార్తలు అందుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.
- కర్కాటక రాశి : కెరీర్ పరంగా ఎదురుచూస్తున్న ఉపశమనం లభిస్తుంది. మీ కష్టాన్ని సీనియర్లు గుర్తిస్తారు. పదోన్నతి (ప్రమోషన్) పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
- సింహ రాశి : సూర్య సంచారం మీకు అత్యంత కీలకం కానుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు సాఫీగా సాగుతాయి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాల ద్వారా భారీ లాభాలు చేకూరే అవకాశం ఉంది.
- కన్య రాశి : వ్యాపార లావాదేవీలకు ఈ సమయం చాలా బాగుంది. వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, మార్కెట్లో మీ బ్రాండ్ ఇమేజ్ను పెంచుకోవడానికి ఇది సరైన సమయం.
- ధనుస్సు రాశి : కెరీర్ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. కొత్త అవకాశాల కోసం చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. కుటుంబ వ్యాపారాలు చేసే వారికి లాభాలు పెరుగుతాయి. చాలా కాలంగా వాహనం కొనాలనుకునే వారి కల ఈ సమయంలో నెరవేరవచ్చు.
ఈ గ్రహ సంచార సమయంలో పెట్టుబడులు, పొదుపు విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

