Datta Jayanti 2025: ఈ ఏడాది దత్తాత్రేయ జయంతి డిసెంబర్ 4 అంటే ఈరోజు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఈ దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. ఇక ఈరోజు దత్తాత్రేయుని జననం గురించి, దత్తాత్రేయుని జయంతి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. దత్త జయంతి నాడు ఇలా చేయడం వలన మంచి జరుగుతుంది.
పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. పౌర్ణమి నాడు చంద్రుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. కార్తీక పౌర్ణిమ, శ్రావణ పౌర్ణమికి ఎలా విశిష్టత ఉన్నాయో అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు దత్త జయంతి. అందరికీ గురు దత్తునిగా, దత్తాత్రేయ స్వామిగా తెలిసిన దత్తాత్రేయ జయంతి మార్గశిర పౌర్ణమి నాడు వస్తుంది.
Datta Jayanti 2025: ఈరోజే దత్త జయంతి (pinterest)
ఈ ఏడాది దత్తాత్రేయ జయంతి డిసెంబర్ 4 అంటే ఈరోజు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఈ దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. ఇక ఈరోజు దత్తాత్రేయుని జననం గురించి, దత్తాత్రేయుని జయంతి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
ఎందుకు దత్తాత్రేయుడిని గురువుగా కొలుస్తారు?
దత్తాత్రేయుడు అత్రి మహర్షికి పుట్టాడు. ఈయనలో ఉన్న జ్ఞానం అపారమైనది. ఈయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. అందుకే గురువుగా చాలా మంది భావించి ఆశ్రయించారు. తన భక్తులైనటువంటి యదు, కార్తవీర్యార్జునుడు, ప్రహ్లాదుడు, అల్లర్కుడు వంటి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు. అందుకే గురు దత్తుడిగా చెబుతారు.
దత్తాత్రేయుని జననం
ఈయన అవతారం చాలా మనోహరంగా అనిపిస్తుంది. నారదుడు అడిగితే బ్రహ్మ ఆయన జననం గురించి చెప్పారు. అత్రి మహర్షి చేసిన తపస్సుకు మెచ్చిన నారాయణుడే స్వయంగా అతనికి కొడుకుగా అవతరించాడు. ఇలా స్వయంగా వాసుదేవుడే దత్తాత్రేయుడిగా మారాడు. ఇది దత్తాత్రేయుని జననం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురు అంశలతో పుట్టాడు. కనుక మూడు తలల బాలుడుగా, మూడు తలల గురువుగా చూపిస్తారు.
దత్త జయంతి నాడు ఏం చేయాలి?
దత్త జయంతి నాడు ఇలా చేయడం వలన మంచి జరుగుతుంది. దత్తాత్రేయుని అనుగ్రహం కలిగి, ఆనందంగా ఉండచ్చు. దత్తాత్రేయుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు.
ఉదయాన్నే నది స్నానం చేయాలి. అలా కుదరకపోతే బావి నీరు తీసుకుని స్నానం చేయొచ్చు.
ఆ తర్వాత షోడశోపచార పూజను చేసి ధ్యానం, జపం వంటివి చేస్తే మంచి జరుగుతుంది.
దత్తాత్రేయుడు యోగమార్గాన్ని అనుసరించాడు. అందుకనే చాలా మంది యోగమార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు.
మన ఆధ్యాత్మిక తత్వంలో ఉన్న గురువుల చరిత్రలను దత్త జయంతి నాడు పారాయణం చేస్తారు.
ఈరోజు దత్తక్షేత్రాలను దర్శిస్తే సకల పాపాలు తొలగిపోయి ఐశ్వర్యాలు కలుగుతాయి.
దత్తాత్రేయుడికి ఇష్టమైనటువంటి గోవులను, శునకాలను పూజిస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది.
దత్తాత్రేయుడిని ఈరోజు ఆరాధించడం వలన పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. అలాగే ఈరోజు ఉపవాసం ఉంటే కూడా మంచి జరుగుతుంది.
దత్తాత్రేయుడు గంగా స్నానం చేయడానికి ఈరోజు భూమిపైకి వస్తాడని నమ్ముతారు. అందుకని గంగా నది ఒడ్డున దత్త పాదుకలను పెట్టి పూజిస్తారు. ఇలా చేస్తే పూర్వజన్మ దోషం నుంచి విముక్తి కలుగుతుంది.