నేడే మోహినీ ఏకాదశి: హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వైశాఖ మాసంలో వచ్చే 'మోహిని ఏకాదశి'కి ఒక ప్రత్యేకత ఉంది. పేరుకు తగ్గట్టే, మనిషిని చుట్టుముట్టే మోహపాశాల నుంచి, అశాంతి నుంచి విముక్తి ప్రసాదించే శక్తి ఈ వ్రతానికి ఉందని భక్తుల నమ్మకం. ఈ ఏడాది ఏప్రిల్ 27న అంటే ఈరోజు ఈ పర్వదినాన్ని జరుపుకుంటున్నాము. శ్రీమహావిష్ణువు తన మోహిని రూపంతో రాక్షసులను మైమరపించి, దేవతలకు అమృతాన్ని అందించిన రోజు కావడంతో దీనికి ఈ పేరు వచ్చింది.
రామచంద్రుడికే మార్గదర్శనం చేసిన వ్రతం

ఈ వ్రత విశిష్టత గురించి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా వియోగంతో బాధ పడుతున్నప్పుడు, తన మనోవేదనను తగ్గించే మార్గం చూపమని వశిష్ట మహర్షిని కోరారు. "రామా! నీ నామస్మరణే సకల పాపాలను హరిస్తుంది. అయినా లోక కళ్యాణం కోసం, మానవాళికి మేలు చేసే పవిత్రమైన మోహిని ఏకాదశి వ్రతం గురించి చెబుతాను విను," అని వశిష్టుడు ఈ కథను వివరించారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల కలిగే పుణ్యం వెయ్యి ఆవులను దానం చేసిన దానితో సమానమని ఆయన పేర్కొన్నారు.
భద్రావతి నగరం.. ధృతబుద్ధి పశ్చాత్తాపం
సరస్వతీ నదీ తీరంలోని భద్రావతి అనే నగరాన్ని చంద్రవంశానికి చెందిన ధృతిమాన్ అనే రాజు పాలించేవాడు. అదే నగరంలో ధనపాలుడు అనే గొప్ప విష్ణు భక్తుడు, వ్యాపారి ఉండేవాడు. అతడు ఎన్నో ధర్మకార్యాలు, బావులు, సత్రాల నిర్మాణం చేపట్టిన పుణ్యాత్ముడు. అతనికి ఐదుగురు కుమారులు. వారిలో ఐదవవాడైన ధృతబుద్ధి మాత్రం దురలవాట్లకు లోనై, తండ్రి సంపాదనను వేశ్యల కోసం, జూదం కోసం తగలేసేవాడు.
ఒకానొక సందర్భంలో తండ్రి, సోదరులు అతడిని ఇంటి నుంచి వెలివేయడంతో అడవుల పాలై ఆకలిదప్పులతో అలమటించాడు. తన తప్పు తెలుసుకున్న ధృతబుద్ధి, పూర్వజన్మ సుకృతం కొద్దీ కౌండిన్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. "మహర్షి! నేను చేసిన పాపాలకు అంతం లేదా? నాకు విముక్తి కలిగించే మార్గం చూపండి," అని వేడుకున్నాడు.
మోక్షం ప్రసాదించే కౌండిన్య ఉపదేశం
వ్యాకులతతో ఉన్న ధృతబుద్ధిని చూసి జాలిపడ్డ కౌండిన్య మహర్షి, "వైశాఖ శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించు. దీనివల్ల అనేక జన్మల పాపాలు భస్మమైపోతాయి," అని మార్గదర్శనం చేశారు. మహర్షి చెప్పిన విధంగానే ధృతబుద్ధి నియమ నిష్ఠలతో వ్రతం ఆచరించి, తన పాపాల నుంచి విముక్తుడై చివరికి విష్ణులోకాన్ని చేరుకున్నాడు.
{{/usCountry}}వ్యాకులతతో ఉన్న ధృతబుద్ధిని చూసి జాలిపడ్డ కౌండిన్య మహర్షి, "వైశాఖ శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించు. దీనివల్ల అనేక జన్మల పాపాలు భస్మమైపోతాయి," అని మార్గదర్శనం చేశారు. మహర్షి చెప్పిన విధంగానే ధృతబుద్ధి నియమ నిష్ఠలతో వ్రతం ఆచరించి, తన పాపాల నుంచి విముక్తుడై చివరికి విష్ణులోకాన్ని చేరుకున్నాడు.
{{/usCountry}}నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, మానసిక ఒత్తిడితో సతమతమయ్యే వారికి ఈ వ్రతం ఒక దివ్యౌషధం వంటిది. కేవలం ఉపవాసం ఉండటమే కాకుండా, మనసులోని చెడు ఆలోచనలను త్యజించి, సాత్విక జీవనాన్ని అలవరుచుకోవడమే ఈ ఏకాదశి అంతరార్థం. సాయంత్రం వేళ విష్ణు నామ సంకీర్తన చేస్తూ, ఈ కథను పఠించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.