మనిషి పుట్టినప్పటి నుంచి మరణం దాకా మొత్తం 16 సంస్కారాలు ఉంటాయి. ఇందులో అంతిమ సంస్కారాలు అనేవి కీలకమైనవి. చనిపోయిన తర్వాత వ్యక్తి శరీరం నుంచి ప్రాణం వెళ్లిపోయాక వెంటనే వారి ముక్కు, చెవులలో దూదిని పెడతారు. అసలు ఎందుకు ఇలా చేయాలి? మరణం తర్వాత చెవుల్లో, ముక్కులో ఎందుకు దూది పెడతారు? దీని వెనక కారణాలు ఏంటో తెలుసుకుందాం.

గరుడ పురాణం, శాస్త్ర దృక్పథం ప్రకారం దీని వెనక పలు కారణాలు ఉన్నాయి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మన శరీరం 9 ద్వారాలతో నిర్మితమై ఉంటుంది. రెండు కళ్ళు, రెండు నాసికా రంధ్రాలు, రెండు చెవులు, నోరు, మలమూత్ర విసర్జన అవయవాలు ఇలా మొత్తం తొమ్మిది ద్వారాలు ఉంటాయి. మరణ సమయంలో ఆత్మ ఈ ద్వారాలలో ఏదో ఒకదాని ద్వారా శరీరాన్ని వదిలి వెళ్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఆచారాల వెనుక ముఖ్య ఉద్దేశాలు ఇవే:
ఆత్మ తిరిగి రాకుండా
చనిపోయిన వెంటనే ఆత్మకు శరీరంపై ఉన్న మమకారం పూర్తిగా పోదని నమ్మకం. అందుకనే ఆత్మ మళ్లీ శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి ఈ ద్వారాలను దూదితో మూసివేస్తారు. ఇలా చేయడం వలన ఆత్మ తన తదుపరి ప్రయాణాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగించడానికి సహాయపడుతుందని విశ్వసిస్తారు.
బంగారం, తులసి రక్షణ
చనిపోయిన వారి నోట్లో తులసి దళాలను పెడతారు. కొంత మంది బంగారాన్ని కూడా ఉపయోగిస్తారు. బంగారం పవిత్రమైనదిగా, తులసి మోక్షాన్ని ప్రసాదించేదిగా భావిస్తారు. బంగారం లేదా తులసిని ఉంచడం వలన దోషాలు తొలగిపోతాయని, ఆ శరీరం పరలోక ప్రయాణానికి అర్హత పొందుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రతికూల శక్తుల నుంచి రక్షణ
చనిపోయాక శరీరం ప్రాణం లేని నిర్జీవ వస్తువుగా మారుతుంది. అలాంటప్పుడు ప్రతికూల శక్తులు, దుష్టశక్తులు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని నమ్మకం. అందుకే దూదిని ఒక రక్షణ కవచంలా ఉపయోగిస్తారు. శరీరాన్ని అపవిత్రం కాకుండా దూది కాపాడుతుందని భావిస్తారు.
ఆరోగ్య భద్రత
{{/usCountry}}చనిపోయాక శరీరం ప్రాణం లేని నిర్జీవ వస్తువుగా మారుతుంది. అలాంటప్పుడు ప్రతికూల శక్తులు, దుష్టశక్తులు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని నమ్మకం. అందుకే దూదిని ఒక రక్షణ కవచంలా ఉపయోగిస్తారు. శరీరాన్ని అపవిత్రం కాకుండా దూది కాపాడుతుందని భావిస్తారు.
ఆరోగ్య భద్రత
{{/usCountry}}ఆధ్యాత్మిక కారణాలతో పాటు దీని వెనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. చనిపోయిన కొద్దిసేపటికే శరీరంలో కుళ్లిపోయే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ సమయంలో శరీరంలోని కణాలు నశిస్తాయి. బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు వేగంగా అభివృద్ధి చెందుతాయి.
ముక్కు, చెవులు వంటి రంధ్రాలను దూదితో మూసివేస్తే శరీరంలోని ద్రవాలు బయటకు రావడం తగ్గుతుంది. దుర్వాసన, బ్యాక్టీరియా వ్యాప్తిని కొంత వరకు నియంత్రించడానికి ఇది సహాయ పడుతుంది. అలాగే, చనిపోయిన తర్వాత శరీరంలో వాయువుల ఉత్పత్తి కారణంగా ఒత్తిడి పెరిగి కొన్ని ద్రవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దూదిని ఉపయోగించడం వలన శరీరం శుభ్రంగా ఉండేలా చూసుకోవచ్చు.