...
...
Next Story

Jyeshtha Adhika Masam 2026 : ఈ ఏడాదిలో 12 కాదు 13 నెలలు... పురుషోత్తమ మాసం విశిష్టత ఏంటి..? పూర్తి వివరాలు

Jyeshtha Adhik Maas 2026 : ఈసారి జ్యేష్ఠ మాసంలో అధికమాసం రానుంది. మే 17 నుంచి జూన్ 15, 2026 వరకు జరిగే ఈ ప్రత్యేక మాసాన్ని విష్ణువు మాసంగా పరిగణిస్తారు, దీనినే పురుషోత్తమ మాసం అని కూడా అంటారు.

Published on: Apr 18, 2026, 16:32:59 IST
Advertisement

Jyeshtha Adhik Maas 2026 : సాధారణంగా ఇంగ్లీష్ క్యాలెండర్‌లో ఏడాదికి 12 నెలలు ఉన్నట్లే…. హిందూ పంచాంగంలో కూడా 12 నెలలు ఉంటాయి. కానీ, 2026వ సంవత్సరంలో మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది మనకు 12 నెలలకు బదులుగా 13 నెలలు వస్తున్నాయి. దీనినే మనం 'అధిక మాసం' అంటారు.

జ్యేష్ఠ అధిక మాసం 2026
జ్యేష్ఠ అధిక మాసం 2026

ఈసారి జ్యేష్ఠ మాసంలో ఈ అధిక మాసం రావడం వల్ల జ్యేష్ఠం రెండు నెలల పాటు ఉంటుంది. అసలు ఈ అదనపు నెల ఎందుకు వస్తుంది…? దీనిని పురుషోత్తమ మాసం అని ఎందుకు పిలుస్తారో పురాణ గాథల ఆధారంగా ఇక్కడ ఉన్న వివరాలను తెలుసుకోండి….

హిందూ ధర్మంలో ప్రతి నెలకు ఒక అధిదేవత ఉంటారు. అయితే పూర్వం పంచాంగంలో అదనంగా వచ్చి చేరిన ఈ మాసానికి ఏ దేవుడూ అధిపతిగా ఉండటానికి అంగీకరించలేదట. దాంతో దీనిని అందరూ 'మల్ మాసం' (మురికి లేదా అపవిత్రమైన నెల) అని పిలవడం ప్రారంభించారు. ఈ అవమానంతో దుఃఖించిన ఆ మాసం శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లి తన బాధను విన్నవించుకుంది. ఆ మాసం పట్ల కరుణ చూపిన విష్ణుమూర్తి, తన పేరు అయిన 'పురుషోత్తముడు' అనే పేరునే ఆ మాసానికి ప్రసాదించి….. తానే దానికి అధిపతిగా ఉంటానని ప్రకటించారు.

"ఈ మాసంలో నన్ను నిశ్చలమైన భక్తితో ఆరాధించే భక్తులకు, ఏడాది పొడవునా చేసే పూజల కంటే ఎక్కువ ఫలితం దక్కుతుంది" అని విష్ణువు వరం ఇచ్చారు. పద్మ పురాణంలోని 'పురుషోత్తమ మాస మహాత్మ్యం'లో శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజుకు ఈ మాసం యొక్క విశిష్టతను వివరించినట్లు గ్రంథాలు చెబుతున్నాయి.

హిందూ క్యాలెండర్ ప్రకారం….. 2026లో జ్యేష్ఠ అధిక మాసం మే 17, ఆదివారం ప్రారంభమై.. జూన్ 15, సోమవారం వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఎలాంటి లౌకికపరమైన శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు చెబుతున్నారు.

ఈ నెలలో చేయాల్సిన పనులు:

  • నిత్యం విష్ణుమూర్తిని ఆరాధించాలి.
  • 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించాలి.
  • అన్నదానం, వస్త్రదానం మరియు ముఖ్యంగా నీటి దానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది.
  • భగవద్గీత, భాగవత పురాణం పఠించడం లేదా వినడం శ్రేయస్కరం.
  • హనుమాన్ చాలీసా, సంకట మోచన హనుమాన్ అష్టకాన్ని పఠించడం వల్ల కష్టాలు తొలగుతాయి.

చేయకూడని పనులు:

పురుషోత్తమ మాసాన్ని ఆధ్యాత్మిక సాధనకే కేటాయించాలి. కాబట్టి ఈ సమయంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనం, పుట్టువెంట్రుకలు తీయడం వంటి శుభకార్యాలు చేయరాదు. అలాగే మద్యం, మాంసాహారం, అనైతిక చర్యలకు పూర్తిగా దూరంగా ఉండాలి.

గమనిక: ఈ కథనంలోని సమాచారం మత గ్రంథాలు, పండితుల అభిప్రాయాల ఆధారంగా అందించబడింది. దీనిని పూర్తి సత్యమని హిందుస్తాన్ టైమ్స్ ధృవీకరించడం లేదు. మరిన్ని వివరాల కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించగలరు.

అధికారుల్లో ఏం చేయాలి? పురుషోత్తమ మాసంలో కొన్ని ప్రత్యేక పనులు చాలా ఫలవంతమైనవిగా పరిగణించబడతాయి: ప్రతిరోజూ విష్ణుమూర్తిని పూజించడం మరియు 'ఓం నమో భగవతే వాసుదేవయా' మంత్రాన్ని పఠించడం (ముఖ్యంగా నీటి దానం, ఆహారం దానం మరియు బట్టలు దానం) ఉపవాసం మరియు ఉపవాసం భగవత్ పురాణ పఠనం హనుమాన్ చాలీసా మరియు సంకట్ మోచన హనుమాన్ అష్టక్ యొక్క క్రమం తప్పకుండా పఠనం, ఈ నెలలో చేసే ఏదైనా శుభకార్యం సాధారణ నెల కంటే వంద రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తుంది.

అధికారుల్లో ఏం చేయకూడదు? ఈ పవిత్ర మాసంలో, వివాహం, ఇంటి ప్రవేశం, టన్సర్ వంటి ప్రధాన శుభకార్యాలు నిషేధించబడ్డాయి. ఈ పనులు అధికారుల తర్వాత చేస్తారు. అలాగే, ఈ నెలలో, మాంసాహారం, మద్యం మరియు అనైతిక చర్యలకు పూర్తిగా దూరంగా ఉండాలి.

అధిక్ మాస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? హిందూ క్యాలెండర్ ప్రకారం, 2026 సంవత్సరంలో, జ్యేష్ఠ మాసంలో అధిక్మాస్ జరుగుతాయి. పవిత్ర మాసం మే 17 ఆదివారం ప్రారంభమై జూన్ 15 సోమవారం ముగుస్తుంది. ఈ సమయంలో, ఎలాంటి శుభకార్యాలు చేయడం నిషేధించబడింది. నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పుకోము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe