...
...
Next Story

ప్రయాణికులకు అలర్ట్ - శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు, ఇవాళ్టి నుంచే బుకింగ్స్

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. శబరిమలకు మరో 10 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. డిసెంబరు 13 నుంచి జనవరి 2 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.డిసెంబరు 3వ తేదీ నుంచే టికెట్ల బుకింగ్‌ మొదలవుతుంది.

Published on: Dec 3, 2025, 10:21:36 IST
Advertisement

శబరిమలకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో 10 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.డిసెంబరు 13 నుంచి జనవరి 2 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇందుకు సంబంధించిన టికెట్లు ఇవాళ్టి (డిసెంబరు 3) నుంచే బుకింగ్స్ చేసుకోవచ్చు.

  • సిర్పూర్ కాగజ్ నగర్ - కొల్లాం మధ్య డిసెంబర్ 13వ తేదీన ఒక సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
  • చర్లపల్లి - కొల్లాం జంక్షన్ మధ్య డిసెంబర్ 17, 31 తేదీల్లో ఒక్కో సర్వీస్ రాకపోకలు సాగిస్తాయి.
  • చర్లపల్లి - కొల్లాం జంక్షన్ మధ్య డిసెంబర్ 20వ తేదీన మరో సర్వీస్ ఉంటుంది.
  • హజూర్‌సాహిబ్‌ నాందేడ్‌ - కొల్లాం జంక్షన్ మధ్య డిసెంబర్ 24వ తేదీన ఒక సర్వీస్ ఉంటుంది.
  • కొల్లాం జంక్షన్ - చర్లపల్లి మధ్య డిసెంబర్ 15వ తేదీన ఒక సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
  • కొల్లాం జంక్షన్ - చర్లపల్లి మధ్య డిసెంబర్ 19, జనవరి 2 తేదీల్లో ఒక్కో సర్వీస్ రాకపోకలు సాగిస్తుంది.
  • కొల్లాం జంక్షన్ - చర్లపల్లి మధ్య డిసెంబర్ 22, 26 తేదీల్లో ఒక్కో సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)
శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)

రానుపోను కలిపి 10 ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి కొల్లాం వెళ్లే ప్రత్యేక రైలుబెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో ఆగుతుంది. విజయవాడ, తిరుపతి మీదుగా కొల్లాం వెళుతుంది.

చర్లపల్లి నుంచి కొల్లాంకు వెళ్లే స్పెషన్ ట్రైన్…. సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, శంకర్‌పల్లి వికారాబాద్, తాండూరు మీదుగా గుంతకల్, చిత్తూరు, కాట్పాడి రూట్‌ మీదుగా వెళ్తుంది. హజూర్‌సాహిబ్‌ నాందేడ్‌-కొల్లం స్పెషల్ ట్రైన్… నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడ, తిరుపతి, కొట్టాయం మీదుగా వెళ్తుంది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe