...
...
Next Story

పదో తరగతి మార్కులతో తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు!

తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Published on: Jul 9, 2026, 06:43:08 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1500 కండక్టర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆర్టీసీలో కండక్టర్ పోస్టుల భర్తీ చేపట్టి చాలా ఏళ్లు అయింది. ఇప్పటికే చాలా మంది కండక్టర్లు రిటైర్డ్ అయ్యారు. ఈ నియామక ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా నిర్వహించనుంది.

తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు

పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఆర్టీసీ. ప్రభుత్వ అనుమతి లభించడంతో నోటిఫికేషన్ విడుదలకు ఆర్టీసీ వేగంగా అడుగులు వేస్తోంది. అయితే పదో తరగతి మార్కుల విషయంపై చిన్న గందరగోళం నెలకొన్నది. ఈ నోటిఫికేషన్ విడుదలకు ముందు ఆర్టీసీ ఒక సాంకేతిక సమస్యను పరిష్కరించాల్సి ఉంది. గతంలో కండక్టర్ పోస్టులను పదో తరగతి మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేసేవారని తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేయనున్నారు కానీ.. ఆ తర్వాత విద్యాశాఖ జీపీఏ గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. మళ్లీ ఇటీవల మార్కుల విధానం అమల్లోకి వచ్చింది.

దీనివల్ల దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరికి మార్కులు, మరికొందరికి గ్రేడింగ్ పాయింట్లు ఉండే అవకాశం ఉంది. ఈ రెండింటినీ సమానంగా ఎలా అంచనా వేయాలనే అంశంపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేడింగ్ పాయింట్లను మార్కుల శాతంలోకి ఎలా మార్చాలనే దానిపై క్లారిటీ ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం ఎస్సెస్సీ బోర్డుకు లేఖ రాసినట్టుగా సమాచారం. బోర్డు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే.. అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. పదో తరగతి మార్కుల్లో ఈ రెండు విభిన్న విధానాల అభ్యర్థులకు న్యాయం జరిగేలా గ్రేడింగ్‌ను మార్కుల శాతంలోకి ఎలా మార్చాలనే అంశంపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

పదో తరగతి గ్రేడింగ్, మార్కుల లెక్కింపుపై ఎస్సెస్సీ బోర్డు నుంచి క్లారిటీ రాగానే ఆర్టీసీ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఆర్టీసీలో ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులు తమ టెన్త్ మెమోలు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆదాయం సిద్ధం చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks