రూ.500కే రూ.16 లక్షల ఇల్లు.. లక్కీ డ్రాలో కొట్టేసిన 10 నెలల పాప!
ఇటీవల సోషల్ మీడియాలో ఇంటి అమ్మకానికి సంబంధించిన లక్కీ డ్రా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ లక్కీ డ్రాలో పది నెలల పాప ఇంటిని గెలుచుకుంది.
అదృష్టం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో చెప్పలేం. మనం అనుకోం.. కానీ మనకు రావాలి అని రాసిపెట్టి ఉంటే.. లక్షలు విలువ చేసేదైనా కాళ్ల దగ్గరకు వస్తుంది. అలాంటి వాటికి తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఘటనే ఉదాహరణ. ఇటీవల చౌటుప్పల్కు చెందిన వ్యక్తి తన ఇంటిని విక్రయించేందుకు లక్కీ డ్రా పద్ధతి ఎంచుకున్న విషయం తెలిసిందే. ఈ లక్కీ డ్రాలో 10 నెలల పాప రూ.500కే రూ.16 లక్షల విలువైన ఇంటిని సొంతం చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కంచర్ల రామబ్రహ్మం అనే వ్యక్తికి రేకుల గదితో 66 గజాల ఇంటి స్థలం ఉంది. అయితే దీనిని అమ్మడానికి ఆయన వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. లక్కీ డ్రా పద్ధతిలో ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రూ.500 విలువైన కూపన్ను కొనుగోలు చేసి.. లక్కీ డ్రాలో పాల్గొనాలని ఫ్లెక్సీలు పెట్టారు. ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
లోకల్ మార్కెట్ ప్రకారం స్థలం, గది విలువ రూ.16 లక్షలు. దీనికి తగ్గట్టుగా 3 వేల కూపన్లు ముద్రించారు యజమాని రామబ్రహ్మం. కొనుగోలు చేసిన కూపన్ మీద వివరాలు రాసి డబ్బాలో వేయాలి. నవంబర్ 2న లక్కీ డ్రా తీస్తానని ప్రకటించారు. ఈ విషయం తెలుసుకుని చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి లక్కీ డ్రాలో కూపన్ వేసి వెళ్లారు.
అలాగే సంగారెడ్డి జిల్లా శంకర్పల్కి చెందిన శంకర్ తన కుటుంబ సభ్యుల నలుగురి పేర్ల మీద కూపన్ తీసుకున్నారు. తన పేరు, భార్య, ఇద్దరు పిల్లల మీద కూపన్ కొని వివరాలు రాశారు. నవంబర్ 2న ఆదివారం నాడు యజమాని రామబ్రహ్మం ఓ ఫంక్షన్ హాలులో లక్కీ డ్రా తీశారు. అయితే శంకర్ 10 నెలల కుమార్తె హన్సిక లక్కు తగిలింది. రూ.16 లక్షల విలువైన ఇంటిని ఆమె డ్రాలో గెలుచుకుంది. 2307 సీరియల్ నెంబరు కూపన్లో ఆమె వివరాలు ఉన్నాయి. లక్కీ డ్రాలో ఈ కూపన్ వచ్చింది.
దీంతో వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వారు కోరిన సమయంలో రిజిస్ట్రేషన్ చేస్తానని యజమాని చెప్పారు. చాలా రోజుల నుంచి ఇంటితోపాటుగా 66 గజాల స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నించినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇలా ప్లాన్ చేశారు యజమాని. రూ.500 చొప్పున సుమారు 3600 కూపన్లు అమ్ముడుపోయినట్టుగా రామబ్రహ్మం తెలిపారు. అనుకున్నదానికంటే ఎక్కువే డబ్బులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


