హైదరాబాద్లో దారుణమైన ఘటన జరిగింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ సిటీ కాలనీలో 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ సునీతను ఆమె మాజీ భర్త దారుణంగా హత్య చేశాడు. నిందితుడు మహేష్ రెండు కత్తులు, పెట్రోల్ డబ్బా తీసుకుని సునీత ఇంట్లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. ఆమెపై కత్తులతో దాడి చేసి, తరువాత పూల కుండితో తలపై పగులగొట్టి చంపేశాడు. దీంతో సునీత అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, సునీత కొన్ని రోజుల క్రితం మహేష్కు విడాకులు ఇచ్చింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఏడాది క్రితమే సునీత మహేశ్కు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకుంది. ఈ విషయంపై కోపం పెంచుకున్న మహేశ్.. ఆమెను హత్య చేశాడు. పారిపోతుండగా.. అతడిని అపార్ట్మెంట్ వాసులు పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివాహితపై పెట్రోల్ పోసి..
మహబూబాబాద్లోనూ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ వ్యక్తి ఘోరమైన ఘటనకు పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు మండలానకి చెందిన ఓ మహిళకు భర్తతో వివాదాలు ఉండటంతో కొన్నేళ్లుగా వేరుగా ఉంటుంది. కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తోంది.
మహిళకు అంజయ్య అనే వ్యక్తి పరిచయమయ్యాడు. స్నేహం ఏర్పరచుకున్నాడు. తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. చాలా రోజులుగా వేధిస్తున్నాడు. అయితే తనకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారని ఆ మహిళ అతడికి గట్టిగా చెప్పింది. ఇలాంటివి కుదరవని వివరించింది. ఎన్నిసార్లు చెప్పినా అంజయ్య బుద్ధి మారలేదు. మహిళను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నాడు. దీంతో భరించలేక హైదరాబాద్ వెళ్లింది.
కొన్ని రోజుల కిందట తిరిగి వచ్చి.. తన తల్లి ఇంట్లో ఉంటుంది. ఇదే విషయం అంజయ్యకు తెలిసింది. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని తెలుసుకున్నాడు. సీసాలో పెట్రోల్ తీసుకువచ్చి.. ఆమెపై పోసి నిప్పంటించాడు. దీంతో అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. ఇద్దరికీ తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి.. మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఎంజీఎం వరంగల్కు తరలించారు. అంజయ్య పరిస్థితి విషమించి చనిపోయాడు.
{{/usCountry}}కొన్ని రోజుల కిందట తిరిగి వచ్చి.. తన తల్లి ఇంట్లో ఉంటుంది. ఇదే విషయం అంజయ్యకు తెలిసింది. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని తెలుసుకున్నాడు. సీసాలో పెట్రోల్ తీసుకువచ్చి.. ఆమెపై పోసి నిప్పంటించాడు. దీంతో అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. ఇద్దరికీ తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి.. మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఎంజీఎం వరంగల్కు తరలించారు. అంజయ్య పరిస్థితి విషమించి చనిపోయాడు.
{{/usCountry}}