యాసిడ్,పెట్రోల్ బాంబులతో దాడి చేశారు… ఇది హత్యాయత్నం కాదా….? వైఎస్ జగన్

మాజీ మంత్రి జోగి రమేశ్ ను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఆయనపై ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పెట్రోల్ దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

Published on: Feb 06, 2026 9:52 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంట్లో దాడి జరిగిన ప్రాంతాన్ని వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. జోగి రమేశ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి… ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని… భయపడాల్సిన అవసరం లేదన్నారు. పెట్రోల్ దాడి జరిగిన ప్రదేశాన్ని పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. పెట్రోల్‌ బాంబులతో దాడి చేసిన వీడియోలను జగన్ కు చూపించారు.

మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంలో వైఎస్ జగన్
మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంలో వైఎస్ జగన్

ఇది హత్యాయత్నం కాదా..? వైఎస్ జగన్

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్… కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అ‍ంబటి ఇంట్లో కొనసాగించిన జంగిల్‌ రాజ్‌ పరంపరను జోగి రమేష్‌ విషయంలో కూడా కొనసాగించారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు జంగిల్ రాజ్ పాలనను చూసి.. నాగరిక ప్రపంచం తలదించుకుంటోందన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై సాయంత్రం నుంచి అర్ధరాత్రివరకు దహనకాండను సాగించారని… మరుసటి రోజు జోగి రమేష్ విషయంలోనూ అదే పరంపర కొనసాగిందన్నారు.

“యాసిడ్,పెట్రోల్ బాంబులతో దాడి చేయడంతో.. మంటలకు జోగి రమేశ్ ఇంటి గోడ ఉబ్బింది. ఆ సమయంలో ఇంట్లో లేవలేని స్థితిలో జోగి రమేశ్ తండ్రి ఉన్నారు. ఇంట్లో ఫర్నిచర్, కర్టెన్స్ కి మంటలు అంటుకుని ఉంటే పరిస్థితి ఏంటి..? ఇది హత్యాయత్నం కాదా..?” అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

చంద్రబాబు అబద్దాలను సీబీఐ సిట్ చార్జిషీట్ తేటతెల్లం చేసింది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదు. చంద్రబాబుది అన్యాయమైన ప్రచారం. వెంకటేశ్వర స్వామి ప్రసాదం ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తి చంద్రబాబే. వీరు సేకరించిన నమూనాలు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటివే. రాజకీయాల కోసం దేవుడిని వాడుకున్న వ్యక్తి ప్రపంచంలో చంద్రబాబు ఒక్కరే. భూమన, వైవీ సుబ్బారెడ్డి తప్పు చేయలేదని సిట్ నిర్ధారించింది. చంద్రబాబు లెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఫ్లెక్సీలతో చంద్రబాబు దుష్ప్రచారాలు చేస్తున్నారు. ప్రశ్నించిన మా నాయకులు అంబటి, జోగి తదితరులపై దాడి చేశారు. అసలు చంద్రబాబు, పవన్, లోకేష్ కు చిప్పే లేదు” అంటూ వైఎస్ జగన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.