సచివాలయంలో ఏసీబీ సోదాలు - CMRF నిధుల కోసం లంచం తీసుకుంటూ దొరికిన అధికారి
సీఎం సహాయ నిధి క్లెయిమ్ క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దర్ని తెలంగాణ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరికి రిమాండ్ తరలించనున్నారు.
హైదరాబాద్లోని సచివాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నిరుపేదలకు అత్యవసర వైద్య సహాయం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కు విడుదల కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం…. సచివాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆనందేషి రాఘవేందర్ (AO-1), బషీర్బాగ్ పరిశ్రమల భవన్లోని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (TSIDC) కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మేడి వినోద్ (AO-2) ఈ అవినీతికి పాల్పడ్డారు.
లంచం తీసుకుంటూ చిక్కిన అధికారులు…
బాధితుడికి సీఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరైన రూ. 2,00,000 వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ చెక్కును ఇచ్చేందుకు, మిగిలిన క్లెయిమ్ను ప్రాసెస్ చేయడానికి అధికారులు లంచం డిమాండ్ చేశారు. మొదట రూ. 5,000 లంచాన్ని రాఘవేందర్ (AO-1), వినోద్ (AO-2) ద్వారా ఫోన్పే ట్రాన్సాక్షన్ రూపంలో తీసుకున్నాడు.
ఆ తర్వాత మిగిలిన రూ. 1,00,000 లంచం మొత్తాన్ని బాధితుడి నుంచి వినోద్ స్వీకరించి రాఘవేందర్కు అందించాడు. అదే సమయంలో దాడి చేసిన ఏసీబీ అధికారులు ఆ నగదును రాఘవేందర్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తమ ప్రభుత్వ విధుల నిర్వహణలో తీవ్ర అక్రమాలకు పాల్పడి అనైతికంగా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించారని ఏసీబీ నిర్ధారించింది.
విచారణ ముమ్మరం…
రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన రాఘవేందర్, వినోద్లను నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై మరింత విచారణ కొనసాగుతోందని ఏసీబీ అధికారులు ప్రకటించారు.
ప్రభుత్వ అధికారులు ఎవరైనా పని చేయడానికి లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్/ట్విట్టర్ (@TelanganaACB) ద్వారా కూడా సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

