తెలంగాణలో 3,053 అటవీ ప్రాంతాల్లో జంతు గణన.. జనవరి 25వ తేదీ వరకు సర్వే
తెలంగాణలో జంతు గణన జనవరి 19వ తేదీన మెుదలవుతోంది. 25వ తేదీ వరకు వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సర్వే జరగనుంది. 3,053 అటవీ ప్రాంతాలు, రిజర్వ్ ఫారెస్టుల్లో జంతు గణన చేయనున్నారు.
పులుల లెక్క, మొత్తం అటవీ జీవవైవిధ్యాన్ని అంచనా వేయడానికి అటవీ శాఖ సిద్ధమైంది. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026ను నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేసింది. రాష్ట్రంలో పులులు, వాటి ఆహారమైన శాఖాహార జంతువులను కూడా లెక్కిస్తారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 19 నుండి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 3,053 అటవీ ప్రాంతాలలో క్షేత్రస్థాయి డేటా సేకరణ జరుగుతుంది. ఈ సర్వేలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, వన్యప్రాణుల అభయారణ్యాలు, అభయారణ్యాలు, ఇతర అటవీ ప్రాంతాలు ఉంటాయి. తెలిసిన పులుల కదలిక జోన్లపై మాత్రమే కాకుండా.. వాటి ఆవాసాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ లెక్కింపు జరుగుతుంది.
శిక్షణ పొందిన అటవీ శాఖ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు ట్రాన్సెక్ట్ లైన్లు వేయడం ద్వారా, టైగర్ పగ్మార్క్లు, స్కాట్ నమూనాలు, స్క్రాచ్ మార్క్లు వంటి సంకేతాలను నమోదు చేయడం ద్వారా క్షేత్రస్థాయి సర్వేలను నిర్వహిస్తారు. అటవీ నివాస పరిస్థితులు, మానవ కార్యకలాపాల ప్రభావంపై డేటాను కూడా మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించి సేకరిస్తారు.
ఈ కార్యక్రమంలో 1,129 మంది వాలంటీర్లు నమోదు చేసుకున్నారని అధికారులు తెలిపారు. WWF, HyTICOS, యానిమల్ వారియర్స్, డెక్కన్ బర్డర్స్, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వంటి ప్రభుత్వేతర సంస్థలు దాదాపు 430 మంది శిక్షణ పొందిన సభ్యులతో ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాయి. అటవీ విభాగాల అవసరాల ఆధారంగా జిల్లా వారీగా వాలంటీర్లను నియమించారు. శాఖాపరమైన పర్యవేక్షణలో డేటా సేకరణలో సహాయం చేస్తారు. సేకరించిన డేటాను కెమెరా ట్రాపింగ్, శాస్త్రీయ విశ్లేషణతో కూడిన తదుపరి దశలలో పులుల సంఖ్య, ఇతర వన్యప్రాణుల స్థితిని సమగ్రంగా అంచనా వేయడానికి ఉపయోగిస్తారు.
పులి అడుగులు, చెట్లకు గోకే గుర్తులు, మలం ఆధారంగా వాటి ఆచూకీ తెలుసుకుంటారు. ఇందుకోసం టెక్నాలజీని వాడుతారు. ఇప్పటిదాకా పులుల సంఖ్యపై కచ్చితమైన సమాచారం లేదు. దీంతో వాటి సంరక్షణ చర్యలు ఇబ్బందులు అయ్యేవి. తాజాగా పులుల గణనతో ఆ సమస్య తీరనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


