సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి(SEZ) డీ-నోటిఫికేషన్ వ్యవహారంలో ప్రముఖ సంస్థ 'ఓమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్'కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. ఈ వివాదంపై గతంలో తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర రక్షణను (స్టే ఆర్డర్) సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు కొనసాగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఈ వ్యవహారంపై స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వంతో సహా ఇతర ప్రతివాదులకు కోర్టు నోటీసులు పంపింది.

న్యాయమూర్తులు జస్టిస్ జే.కే. మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్.చందుర్కర్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఓమిక్స్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను పరిశీలించిన బెంచ్.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు అమల్లోనే ఉంటాయని స్పష్టం చేసింది. దీనితో వివాదాస్పద అమీన్పూర్ సెజ్ భూములకు సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతానికి యథాతథ స్థితి కొనసాగనుంది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం అమీన్పూర్ గ్రామంలోని 4.05 హెక్టార్ల ఎస్ఈజెడ్ ప్రాంతాన్ని పూర్తిగా డీ-నోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘స్పెషల్ ఎకనామిక్ జోన్ల బోర్డ్ ఆఫ్ అప్రూవల్’ ప్రతిపాదించింది. 2025 జూలై 18న జరిగిన బోర్డ్ ఆఫ్ అప్రూవల్ 130వ సమావేశంలో ఈ మేరకు అజెండా అంశం నం. 130.13 కింద డీ-నోటిఫికేషన్ నిర్ణయాన్ని ఆమోదించారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓమిక్స్ ఇంటర్నేషనల్ మొదట తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు.. ఆ అజెండా అంశం అమలును నిలిపివేస్తూ మధ్యంతర స్టే మంజూరు చేసింది. తమకు ఇప్పటికే మంజూరైన అధికారిక అనుమతులకు విరుద్ధంగా కేంద్ర బోర్డు ఏకపక్షంగా ఈ డీ-నోటిఫికేషన్ నిర్ణయం తీసుకుందని ఓమిక్స్ ఇంటర్నేషనల్ సుప్రీంకోర్టు ముందు వాదించింది.
తెలంగాణ ప్రభుత్వం, సంబంధిత విభాగాల నుండి లభించిన అనుమతుల ప్రకారం తాము అధికారిక ఎస్ఈజెడ్ డెవలపర్గా గుర్తింపు పొందే పూర్తి హక్కులను కలిగి ఉన్నామని కంపెనీ పేర్కొంది. ఈ తరుణంలో జోన్ను రద్దు చేస్తే కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడిన ఎస్ఈజెడ్ అభివృద్ధి ప్రాజెక్టుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని న్యాయస్థానానికి వివరించింది.
{{/usCountry}}తెలంగాణ ప్రభుత్వం, సంబంధిత విభాగాల నుండి లభించిన అనుమతుల ప్రకారం తాము అధికారిక ఎస్ఈజెడ్ డెవలపర్గా గుర్తింపు పొందే పూర్తి హక్కులను కలిగి ఉన్నామని కంపెనీ పేర్కొంది. ఈ తరుణంలో జోన్ను రద్దు చేస్తే కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడిన ఎస్ఈజెడ్ అభివృద్ధి ప్రాజెక్టుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని న్యాయస్థానానికి వివరించింది.
{{/usCountry}}సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వుల పట్ల ఓమిక్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఎస్ఈజెడ్ విధానాల ఆశయాలకు కట్టుబడి తాము ఐటీ/ఫార్మా/అభివృద్ధి రంగాల్లో అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో తమ న్యాయపరమైన వాదనలను సమగ్రంగా వినిపించి న్యాయం పొందుతామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ప్రతివాదులు తమ కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణకు రానుంది.