గర్భవతిగా ఉన్న భార్యను దారుణంగా అంతమొందించాడనే ఆరోపణలతో అరెస్టయి, ఇటీవలె బెయిల్పై బయటకు వచ్చిన ఒక వ్యక్తి నిజామాబాద్ నగరంలో దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని రాజారాజేంద్ర (ఆర్ఆర్) సెంటర్ వద్ద గురువారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిని వేటకొడవలితో నరికి చంపిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

పోలీసులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా వద్ద గురువారం సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో 26 ఏళ్ల చితారి హరిబాబు వెళ్తుండగా…. ఒక కారులో వచ్చిన దుండగులు అతడిని టార్గెట్ చేశారు.
"కారులో నుంచి ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకడు హరిబాబును వెంబడించి కొబ్బరికాయలు నరికే పెద్ద వేటకొడవలితో అతడి మెడ, తలపై తీవ్రంగా నరికాడు" అని నిజామాబాద్ ఏసీపీ బి. ప్రసాద్ వెల్లడించారు. తీవ్ర గాయాలపాలైన హరిబాబు రక్తం మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
‘నా చెల్లెలిని చంపినందుకే చంపేశా’ - సెల్ఫీ వీడియో…
ఈ దారుణ హత్య వెనుక పాత కక్షలే కారణమై ఉంటాయని పోలీసులు భావించారు. అనుకున్నట్లు ఈ హత్యకు సంబంధించి వైష్ణవి సోదరుడు సంతోష్ ఓ వీడియో విడుదల చేశాడు. ఈ హత్యను తానే చేసినట్లు బహిరంగంగా ప్రకటించాడు.
{{/usCountry}}ఈ దారుణ హత్య వెనుక పాత కక్షలే కారణమై ఉంటాయని పోలీసులు భావించారు. అనుకున్నట్లు ఈ హత్యకు సంబంధించి వైష్ణవి సోదరుడు సంతోష్ ఓ వీడియో విడుదల చేశాడు. ఈ హత్యను తానే చేసినట్లు బహిరంగంగా ప్రకటించాడు.
{{/usCountry}}"మా చెల్లెలిని దారుణంగా చంపినందుకే నేను హరిబాబును అంతమొందించాను. మా ఇంట్లో జరిగిన విషాదం, ఆ కడుపుకోత ఇక ఏ ఇంట్లోనూ జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను," అని సంతోష్ ఆ వీడియోలో భావోద్వేగానికి గురయ్యాడు. హరిబాబును హతమార్చిన అనంతరం తాను నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోతున్నట్లు కూడా సంతోష్ ఆ వీడియోలో స్పష్టం చేశాడు.
అసలేం జరిగింది..?
ఈ ఏడాది మార్చి 17వ తేదీన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో 'వైషు అమ్మ' పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వైష్ణవి తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆ సమయంలో ఆమె నాలుగు నెలల గర్భిణి. మార్చి 16 రాత్రి దంపతుల మధ్య తీవ్రమైన గొడవ జరిగిందని, ఆ కోపంలో హరిబాబు ఆమె గొంతు నులిమి, కత్తితో దాడి చేసి చంపేశాడని వైష్ణవి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, కోరుట్ల శివార్లలో హరిబాబును అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కట్నం వేధింపుల ఆరోపణలపై హరిబాబు తల్లి లక్ష్మి, సోదరులు ఆనంద్, అశోక్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆరు నెలల కిందట జైలుకు వెళ్లిన హరిబాబు, జులై నెలలోనే (రెండు నెలల క్రితం) బెయిల్పై బయటకు వచ్చాడు.