నల్లా కనెక్షన్ లేదా మురుగు నీటి సమస్యలా? వారానికి నాలుగు రోజులు మీ ప్రాంతంలోనే అధికారులు!

హైదరాబాద్‌లో జలమండలి అధికారులు వారానికి నాలుగు రోజులు మీ ప్రాంతంలోనే తిరగనున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకెళ్తే మీకు పరిష్కారం దొరకనుంది.

Updated on: Feb 20, 2026, 05:42:40 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల మార్గాలను ప్రభావితం చేసే సమస్యలను పరిష్కరించడానికి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) అధికారులు కొత్త విధానానికి శ్రీకారం చూట్టారు. సిబ్బంది వారానికి నాలుగు రోజులు ఉదయం 7.00 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు అన్ని ప్రాంతాలను సందర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి కార్యాలయాలలో అందుబాటులో ఉంటారు. జలమండలి, బస్తీ బాట కార్యక్రమం శుక్రవారం(ఫిబ్రవరి 20, 2026) ప్రారంభం అవుతుంది.

వారానికి నాలుగు రోజులు మీ ప్రాంతంలోనే అధికారులు
వారానికి నాలుగు రోజులు మీ ప్రాంతంలోనే అధికారులు

పరిష్కరించాల్సిన సమస్యలలో లీకేజీలు, తాగునీటి సరఫరాలో తక్కువ ప్రెజర్, నీటి పైపులైన్ల నిర్వహణ, డీసిల్టింగ్, నీటి వృథా, మ్యాన్‌హోల్స్, నీటి కుళాయిలకు మీటర్లు బిగించడం, తాగునీటి నాణ్యతతోపాటుగా ఇతర సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా వర్షపు నీటి సేకరణ గుంతలు, ఇంజెక్షన్ బోర్‌వెల్‌ల గురించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు అధికారులు.

ఉదయం ప్రజలతో మాట్లాడిన తర్వాత, వార్డు మేనేజర్లు గుర్తించిన సమస్యలు, తీసుకున్న తాత్కాలిక పరిష్కారాలు, అవసరమైన దీర్ఘకాలిక పరిష్కారాలపై నివేదికను దాఖలు చేయాలి. దీనిని వారి ఉన్నతాధికారులకు పంపడానికి మొబైల్ యాప్‌కి అప్‌లోడ్ చేస్తారు. శనివారాల్లో సమీక్షా సమావేశం జరుగుతుంది.

మేనేజింగ్ డైరెక్టర్ నుండి వార్డ్ మేనేజర్ల వరకు ప్రతి ఒక్కరూ కాలనీ సందర్శనలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని సమీక్షించడానికి ఎండీ, జాయింట్ ఎండీలు, డైరెక్టర్లు, ప్రాంతీయ కార్యనిర్వాహక డైరెక్టర్లు, ఇతర అధికారులు కూడా ఆకస్మిక తనిఖీలు చేపడతారు.

HMWSSB అధికార పరిధిని కోర్ అర్బన్ రీజియన్ (CURE) చేర్చడానికి విస్తరించిన వారం తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నారు. బోర్డును మూడు ప్రాంతీయ యూనిట్లుగా విభజించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి. HMWSSB సిబ్బంది క్షేత్ర సందర్శనల పలు సమస్యలను పరిష్కరిస్తారు. అవి ఏంటి అంటే..

  • తాగునీటి సరఫరాలో తక్కువ ప్రెజర్
  • నీటి పైపులైన్ల నిర్వహణ
  • మ్యాన్‌హోల్స్
  • లీకేజీలు
  • నీటి కుళాయిలకు మీటర్లు బిగించడం
  • తాగునీటి నాణ్యత, ఇతర సమస్యలు

క్షేత్ర సందర్శనల షెడ్యూల్

  • మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More