తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఇందులో భాగంగా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కు చోటు ఖరారైంది. ఈ మేరకు ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లును ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
మధ్యాహ్నం 12.15 నిమిషాలకు…

శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం 12.15 నిమిషాలకు రాజ్ భవన్లో కేబినెట్ విస్తరణ ఉంటుంది. కొత్త మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేస్తారు. ఇప్పటికే ఆయనతో పాటు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ప్రమాణ స్వీకారానికి సీటింగ్, తదితర అంశాలపై కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుత కేబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా 15 మంది సభ్యులు ఉన్నారు. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలో మరో ముగ్గురు సభ్యులకు ఇంకా అవకాశం ఉంది. అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేస్తే మరో రెండింటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కేబినెట్ లో మైనారీవర్గాలకు చెందిన మంత్రి లేరు. విస్తరణలో తప్పకుండా మైనార్టీ కోటా నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలనే అభిప్రాయాలు ఎప్పట్నుంచే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే…. అజారుదీన్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు ఏఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో… ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అజారుద్దీన్ తో పాటు ఇంకా ఏవరైనా ప్రమాణం చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతోంది. ఇక్కడ భారీ సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్ల ఆధారంగా గెలుపోటములు డిసైడ్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ గెలవటం అధికార కాంగ్రెస్ కు అతిపెద్ద సవాల్ గా మారింది. పైగా బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చింది. దీంతో ముస్లింల ఓట్లు ఏటువైపు ఉంటాయన్న ఆందోళన కూడా ఉంది. అయితే అజారుదీన్ కు కేబినెట్ లోకి తీసుకోవటం వల్ల పార్టీకి లాభం చేకూరవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.అజారుదీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే… రేవంత్ కేబినెట్ లో మైనార్టీ వర్గానికి కూడా అవకాశం లభించినట్లు అవుతుంది.
ఇక అజారుద్దీన్ పేరును కాంగ్రెస్ పార్టీ మరో కోణంలో కూడా ఎంపిక చేసిందన్న చర్చ కూడా వినిపిస్తోంది. బీహార్ ఎన్నికల వేళ ఈ నిర్ణయం కలిసిరావొచ్చని కూడా అంచనా వేసినట్లు తెలుస్తోంది.
{{/usCountry}}ఇక అజారుద్దీన్ పేరును కాంగ్రెస్ పార్టీ మరో కోణంలో కూడా ఎంపిక చేసిందన్న చర్చ కూడా వినిపిస్తోంది. బీహార్ ఎన్నికల వేళ ఈ నిర్ణయం కలిసిరావొచ్చని కూడా అంచనా వేసినట్లు తెలుస్తోంది.
{{/usCountry}}గత ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కోటా కింద అజారుద్దీన్ ను శాసనమండలి (ఎమ్మెల్సీ) సభ్యుడిగా నామినేట్ చేసింది. అయితే గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇంకా ఈ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే అజారుద్దీన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా ఆయన టికెట్ ఆశించారు. కానీ చివరికి నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారైంది. అయితే ఆయనకు కేబినెట్ చోటు కల్పించటంపై హామీ ఇవ్వటంతో… వెనక్కి తగ్గారనే చర్చ కూడా వినిపించింది.
ఈసీకి ఫిర్యాదు:
అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని తెలిపింది. ఈ ఫిర్యాదులపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.