...
...
Next Story

TG BDS Admissions : బీడీఎస్ ప్రవేశాల అప్డేట్ - ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ప్రారంభం

Telangana BDS Admissions : తెలంగాణలో 2026-27 విద్యాసంవత్సరానికి బీడీఎస్ ప్రవేశాల తొలి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 6 సాయంత్రం 4 గంటలలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.

Published on: Sep 4, 2026, 16:52:05 IST
Advertisement

Telangana BDS Admissions : రాష్ట్రంలో డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి గానూ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద బిడిఎస్ (BDS) కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటి విడత వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌ను వర్సిటీ ప్రారంభించింది.

బీడీఎస్ ప్రవేశాలు
బీడీఎస్ ప్రవేశాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డెంటల్ కళాశాలలతో పాటు సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. దివ్యాంగులు (PWD), ఆర్మీ ఉద్యోగుల పిల్లలు (CAP), పోలీసు అమరవీరుల పిల్లలు (PMC), ఆంగ్లో-ఇండియన్ విభాగాల కేటగిరీల అభ్యర్థులు కూడా ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.

ముఖ్యమైన తేదీలు, వెబ్‌సైట్ వివరాలు

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తయి, ఆగస్టు 28న KNRUHS విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలో పేరు ఉన్న NEET UG 2026 అర్హత సాధించిన అభ్యర్థులందరూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అర్హులు.

  • వెబ్ ఆప్షన్ల ప్రారంభం : సెప్టెంబర్ 4, 2026 మధ్యాహ్నం 2:00 గంటల నుంచి
  • చివరి తేదీ : సెప్టెంబర్ 6, 2026 సాయంత్రం 4:00 గంటల వరకు
  • అధికారిక వెబ్‌సైట్ : అభ్యర్థులు కంప్యూటర్ ద్వారా https://tsbdsadm.tsche.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి తమ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

సీట్ల బ్లాకింగ్‌ను అరికట్టేందుకు కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ కొన్ని కఠిన నిబంధనలను విధిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

  • మొదటి విడత కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోని అభ్యర్థులకు తదుపరి విడతల కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదు.
  • అభ్యర్థులు తమ అర్హత, ప్రాధాన్యతను బట్టి ఎన్ని కళాశాలలకైనా పరిమితి లేకుండా ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
  • వెబ్ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఆరు అక్షరాల ఓటీపీ వస్తుంది. ఆప్షన్లు సేవ్ చేసిన తర్వాత ప్రింటౌట్ తీసుకోవడం మంచిది.
  • ఒకవేళ అభ్యర్థికి బీడీఎస్ సీటు కేటాయించిన తర్వాత ఆ కళాశాలలో చేరకపోతే, ఆ తదుపరి కౌన్సెలింగ్ విడతలకు ఆ అభ్యర్థి అర్హత కోల్పోతారు. సీటు వచ్చిన వారు యూనివర్సిటీ ఫీజు రూ. 12,000 ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా చెల్లించి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • అభ్యర్థులు అలాట్‌మెంట్ ఆర్డర్‌లో పేర్కొన్న గడువులోగా కేటాయించిన డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను కలిసి, ఒరిజినల్ సర్టిఫికెట్లు, అవసరమైన బాండ్లు సమర్పించి ట్యూషన్ ఫీజు చెల్లించాలి. నిర్ణీత సమయంలోగా చేరకపోతే ప్రవేశం స్వయంచాలకంగా రద్దవుతుంది.

యూనివర్సిటీ హెల్ప్‌లైన్ నంబర్లు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe