బంద్ ఫర్ జస్టిస్ పేరుతో ఈనెల 18వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ.. తెలంగాణ భవన్లో బీసీ జేఏసీ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, కమిటీ ప్రతినిధులు కేటీఆర్ను కలిశారు. బీసీ ఐకాస ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిదని కేటీఆర్ విమర్శించారు. పార్లమెంటులో చేయాల్సిన పనిని ఇక్కడ చేసి.. వేరే వాళ్ల మీదకు నెడుతున్నారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల మీద తమ పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉందన్నారు. గతంలో శాసనసభలో రెండుసార్లు రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి పంపించామని, కానీ కాంగ్రెస్ పార్టీలాగా ప్రచారం చేసుకోలేదన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా రిజర్వేషన్లు పెడతామని శాసనసభలో చెప్పినప్పుడు మేం మద్దతు ఇచ్చామన్నారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ పద్ధతి సరైనది కాదని కేటీఆర్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ ఐదు రకాలుగా మాట్లాడుతుందన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా, పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇస్తాం అని, ఆర్డినెన్స్, బిల్లు, మరోసారి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక అని కాంగ్రెస్ మాట్లాడుతుందని విమర్శించారు. రకరకాలుగా మాటలు మార్చిన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిపై తాము తప్పకుండా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.
'బీసీ రిజర్వేషన్లకు మా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఈ విషయంలో బీసీ సంఘాల ప్రయత్నాలకు మా పార్టీ సపోర్ట్ ఉంటుంది. బీసీ రిజర్వేషన్లు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రావు. కాంగ్రెస్ తెచ్చిన 42 శాతం రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థల కోసం. కానీ విద్య, ఉపాధికి సంబంధించిన రిజర్వేషన్ల వాటా మిగిలిన అన్ని రంగాల్లో రావాల్సి ఉంది. అన్నింటిలో వాటా రావాలి అని బీసీ సమాజం డిమాండ్ చేయాలి.' అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ఉద్యం మాదిరిగానే.. సమస్యను దిల్లీ దాకా తీసుకెళ్లి తెలంగాణ సాధించుకున్నట్టుగా బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామని కేటీఆర్ అన్నారు. 18న బీసీ సంఘాల బంద్కు తమ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
అన్ని పార్టీలు సహకరించాలి : ఆర్.కృష్ణయ్య
{{/usCountry}}తెలంగాణ ఉద్యం మాదిరిగానే.. సమస్యను దిల్లీ దాకా తీసుకెళ్లి తెలంగాణ సాధించుకున్నట్టుగా బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామని కేటీఆర్ అన్నారు. 18న బీసీ సంఘాల బంద్కు తమ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
అన్ని పార్టీలు సహకరించాలి : ఆర్.కృష్ణయ్య
{{/usCountry}}బీసీ రిజర్వేషన్ల కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రజా ఉద్యమాలు బలంగా ఉంటనే ప్రభుత్వాలు స్పందిస్తాయన్నారు. అన్నాదమ్ముల నడుమ వాటాలు ఎప్పటికైనా పంచాల్సిందేనని స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ఎప్పటికైనా తప్పదు అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు సహకరించాలన్నారు కృష్ణయ్య.