తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మెుదటి రోజున గందరగోళం నెలకొన్నది. అసెంబ్లీ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీ షర్టులు వేసుకుని వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు వారిని లోపలకు వెళ్లనివ్వలేదు. దీంతో అసెంబ్లీ గేటు వద్ద ఆందోళన వ్యక్తమైంది. ఈ గందరగోళం మధ్య తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను అరెస్టు చేశారు.

స్పీకర్ను కులం పేరుతో, అసభ్య పదజాలంతో దూషించారని ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి మధును, కోకాపేటలోని ఆయన నివాసం నుండి నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం వీరిద్దరినీ నారాయణగూడ పోలీస్ స్టేషన్ తరలించారు.
ఈ వ్యాఖ్యలను అధికార కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు తీవ్రంగా ఖండించాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. స్పీకర్ రాజ్యాంగబద్ధమైన హోదాపై వ్యక్తిగత, అభ్యంతరకరమైన దాడులను అనుమతించకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.
ఈ పరిణామాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఘర్షణకు దారితీశాయి. ప్రభుత్వం తమ నాయకులను లక్ష్యంగా చేసుకుంటోందని ప్రతిపక్షం ఆరోపించగా.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార పక్షం స్పష్టం చేసింది. విచారణలో భాగంగా పోలీసులు ఎమ్మెల్సీలను ప్రశ్నిస్తున్నారు, అలాగే ఆరోపించిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను పరిశీలిస్తున్నారు.
ఈ ఉదంతంపై శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. స్పీకర్కు జరిగిన అవమానాన్ని తెలంగాణ ప్రజలకు, సభ్య సమాజానికి జరిగిన అవమానంగా ఆయన అభివర్ణించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీ సభ్యులను పిలిపించి, పథకం ప్రకారమే స్పీకర్పైకి ఉసిగొల్పారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
{{/usCountry}}ఈ ఉదంతంపై శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. స్పీకర్కు జరిగిన అవమానాన్ని తెలంగాణ ప్రజలకు, సభ్య సమాజానికి జరిగిన అవమానంగా ఆయన అభివర్ణించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీ సభ్యులను పిలిపించి, పథకం ప్రకారమే స్పీకర్పైకి ఉసిగొల్పారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
{{/usCountry}}ఒక దళిత వర్గానికి చెందిన నేత స్పీకర్ స్థానంలో ఉండటం ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకులు జుగుప్సాకరమైన భాషను ఉపయోగించారని, కేసీఆర్ మొదటి నుంచీ దళిత వ్యతిరేకి అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. దళితుడిని సీఎం చేస్తాననడం, మూడెకరాల భూమి ఇస్తామనడం అంతా మోసమేనని మండిపడ్డారు. స్పీకర్ పట్ల అపచారంగా ప్రవర్తించిన తాతా మధును పదవి నుంచి డిస్మిస్ చేయడంతో పాటు, ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఈ ఘటనపై తెలంగాణ ప్రజలకు, స్పీకర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ తాతా మధు మాటలను ఖండిస్తూ.. మంత్రి సీతక్క మాట్లాడారు. స్పీకర్ తల్లిని అవమానించడం బాధకరమని అన్నారు. ఈ సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టుకున్నారు.
అసెంబ్లీ సమావేశాల మెుదటి రోజున జరిగిన గందరగోళంలో భాగంగా పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అప్ కార్యకర్త హేమచంద్రపై పెట్రోల్ పోసి కొని హంగామా చేసినందుకు కూడా కేసు నమోదైంది. బీజేపీ కార్యకర్త గణేష్ పైన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీస్ అధికారులపై దారులు చేసి దూషించినందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్, కేటీఆర్తో పాటు మరికొందరిపై కేసులు నమోదు అయ్యాయి.