Anganwadi : అంగన్వాడీలకు మహర్దశ.. తెలంగాణలో 5008 కేంద్రాల అప్గ్రేడ్.. ఏం చేస్తారంటే?
Anganwadi Modernization : తెలంగాణలో 5008 అంగన్వాడీలను ‘సక్షమ్’లో భాగంగా ఆధునికీకరించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఇందు కోసం రూ.30.04 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
తెలంగాణలోని 5,008 అంగన్వాడీ కేంద్రాలను రూ.30.04 కోట్ల వ్యయంతో ‘సక్షమ్ అంగన్వాడీలు’గా ఆధునీకరించాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. మెరుగైన పోషణ, బాల్య సంరక్షణ, విద్యను అందించే లక్ష్యంతో ‘మిషన్ సక్షమ్ అంగన్వాడీ’, ‘పోషణ్ 2.0’ పథకాల కింద, దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాల్లో ఉన్న దాదాపు రెండు లక్షల అంగన్వాడీ కేంద్రాలను మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు.

ఆధునీకరించే ఈ ‘సక్షమ్ అంగన్వాడీలు’ సంప్రదాయ కేంద్రాలతో పోలిస్తే మెరుగైన మౌలిక సదుపాయాలతో ఉంటాయి. వీటిలో ఎల్ఈడీ స్క్రీన్లు, నీటి శుద్ధి వ్యవస్థలు, పోషణ్ వాటిక, బాల్య విద్యకు సంబంధించిన బోధనా సామాగ్రి, ‘Building as Learning Aid’ (BaLA) చిత్రలేఖనాలు వంటి సదుపాయాలు ఉంటాయని కిషన్ రెడ్డి తెలిపారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పోషక మద్దతును అందించే సప్లిమెంటరీ న్యూట్రిషియన్ ప్రోగ్రామ్, రికమండరీ డైటరి అలవెన్స్(RDA), సగటు రోజువారీ ఆహార వినియోగం (ADI) మధ్య ఉన్న అంతరాన్ని పూరించడానికి ప్రధానంగా రూపొందించినట్టుగా పేర్కొన్నారు.
సూక్ష్మపోషకాల అవసరాలను తీర్చడానికి, మహిళలు, పిల్లలలో రక్తహీనతను నియంత్రించడానికి అంగన్వాడీ కేంద్రాలకు ‘ఫోర్టిఫైడ్ రైస్’ (పోషకాలు కలిపిన బియ్యం) సరఫరా చేయబడుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల్లో వండే భోజనం, ఇంటికి తీసుకెళ్లే రేషన్ తయారీలో, వారానికి కనీసం ఒక్కసారైనా చిరుధాన్యాలను (millets) వినియోగించడంపై కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లా వారీగా చూస్తే అప్గ్రేడ్ చేసే ఈ కేంద్రాలలో మేడ్చల్-మల్కాజిగిరిలో 948, భద్రాద్రి-కొత్తగూడెంలో 509, కరీంనగర్లో 365, సంగారెడ్డిలో 298, జనగాంలో 278, సిద్దిపేటలో 238, నారాయణపేటలో 232, కామారెడ్డిలో 226, సూర్యాపేటలో 180, రంగారెడ్డిలో 176, రాజన్న-సిరిసిల్లలో 171 కేంద్రాలు ఉన్నాయి.
ఇతర జిల్లాల్లో నల్గొండలో 156, వనపర్తిలో 153, మహబూబ్నగర్, మెదక్లో 130, జగిత్యాలలో 107, కొమరం భీమ్–ఆసిఫాబాద్లో 105, వికారాబాద్, నిజామాబాద్లో 90 చొప్పున, పెద్దపల్లిలో 66, హనుమకొండలో 65, వరంగల్లో 54, నాగర్కర్నూలులో 51 ఉండగా.. జయశంకర్ భూపాలపల్లిలో 50, బయ్యారంలో 47, ఆదిలాబాద్లో 29, యాదాద్రి-భువనగిరిలో 18, ములుగులో 17, జోగులాంబ-గద్వాల్లో 15, హైదరాబాద్లో 10, నిర్మల్లో 9, మహబూబాబాద్లో మూడు చొప్పున ఉన్నట్టుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


