ప్రతీ ఆసుపత్రిలో కీమోథెరపీ సెంటర్లు.., 100 శాతం ఉచిత వైద్యం అందించే దిశగా హెల్త్ పాలసీ
రాష్ట్రంలోని ప్రతీ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగుల కోసం కీమోథెరపీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టుగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామన్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నాగర్ కర్నూల్ జిల్లా పర్యటించారు. ఈ పర్యటనలో నాగర్ కర్నూల్ పట్టణంలోని ఎండబెట్ల దగ్గర ఉన్న కేసరి సముద్రం మీద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలతో శంకుస్థాపన పనులను మంత్రి దామోదర రాజనర్సింహ స్థానిక శాసన సభ్యుడు డా. రాజేష్ రెడ్డి , శాసన మండలి సభ్యుడు దామోదర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిథిలోని వివిధ వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థల నిర్మాణ పనుల కోసం రూ. లు 20 కోట్లతో శంకుస్థాపన చేశారు. 9 కోట్ల రూపాయలతో పట్టణంలోని జూనియర్ కాలేజీ నూతన కళాశాల భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం నాగర్ కర్నూల్ పట్టణంలో 245 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇందిరా మహిళా శక్తి పథకం 70,80,324 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా మెుత్తం 40 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు వైద్యారోగ్య శాఖ మంత్రి.
కీమోథెరపీ సెంటర్లు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడారు. రాష్ట్రంలో 109 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగుల కోసం కీమోథెరపీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. సభకు వచ్చిన విద్యార్థుల గురించి మంత్రి మాట్లాడారు.
'సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. నైపుణ్యంతో కూడిన విద్యను అభ్యసించాలి. విద్యార్థుల చదువు సమాజ అభివృద్ధికి దోహదపడాలి. రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం.' అని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు.
100 శాతం ఉచిత వైద్యం
అంతకుముందు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు మంత్రి దామోదర రాజనర్సింహ. 'పేదోడికి కొండంత అండగా నిలిచే విప్లవాత్మక నిర్ణయం. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రధాన బాధ్యతగా 100 శాతం ఉచిత వైద్యం అందించే దిశగా త్వరలో సమగ్ర హెల్త్ పాలసీ అమలులోకి తీసుకురానున్నాం. ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు.. ప్రతి పౌరుడికి ఆరోగ్య భద్రత.. ఇదే ప్రజా ప్రభుత్వ సంకల్పం.' అని మంత్రి పోస్ట్ చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


