గత వారం రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా కోడి మాంసం ధరలు భారీగా పెరిగాయి. తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతలు, కోళ్ల మరణాలు, ఫారాల నుండి సరఫరా తగ్గడమే ఈ పెరుగుదలకు కారణాలని పౌల్ట్రీ వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం లైవ్ చికెన్ మాంసం కిలోకు రూ.190-220 చొప్పున అమ్ముడవుతుండగా, శుభ్రం చేసిన బ్రాయిలర్ కోడి మాంసం ధరలు కిలోకు రూ350-370కి పెరిగాయి. వారం రోజుల క్రితం ఈ ధరలు కిలోకు సుమారు రూ.250గా ఉండేవి.

తీవ్రమైన వేడి పరిస్థితుల కారణంగా కోళ్ల మరణాల రేటు అధికమవుతోందని, నగర మార్కెట్లకు కోళ్ల రాక కూడా తగ్గిందని వ్యాపారులు తెలిపారు. తీవ్రమైన వేడి కారణంగా రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు
ప్రతి వేసవిలో కొంత ప్రభావం కనిపిస్తుంది, కానీ ఈ ఏడాది వేడి చాలా తీవ్రంగా ఉంది. చాలా కోళ్లు ఈ ఉష్ణోగ్రతలను తట్టుకోలేకపోతున్నాయి, రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ఈ కారణంగా కొద్ది రోజుల్లోనే ధరలు కిలోకు దాదాపు రూ.70 నుంచి రూ.80 పెరిగాయి. సాధారణంగా వేసవి కాలంలో జనాలు తేలికపాటి ఆహారాన్ని ఇష్టపడటంతో చికెన్కు డిమాండ్ తగ్గుతుంది. కానీ డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ సరఫరా గణనీయంగా తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి.
పెరిగిన రవాణా, కూలింగ్ ఖర్చులను రిటైలర్లు కారణంగా చూపుతున్నారు ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన వేడిగాలుల కారణంగా రవాణా, కూలింగ్ ఖర్చులు కూడా పెరుగుతున్నాయని రిటైలర్లు పేర్కొన్నారు. మరోవైపు ధరలతో వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నారు. కానీ దుకాణ యజమానులు కూడా ఒత్తిడిలో ఉన్నారు. టోకు వ్యాపారుల నుండి చాలా ఎక్కువ ధరలకు చికెన్ కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు.
తెలంగాణలో సగటున సుమారు 11 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తారు. ఎండల కారణంగా కోళ్ల బరువు తూగకపోవడం కారణంగా కూడా 1.5 కిలోలకే పరిమితం అవడం కారణంగా మార్కెట్లోకి తక్కువ మాంసం వస్తోంది. అనేక ప్రాంతాల్లో ఈ పరిస్థితితో ధరలు విపరీతంగా పెరిగాయి.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు
- మే నెలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయి. దీంతో కోళ్లు వేడిని తట్టుకోలేక చనిపోతున్నాయి. దీంతో ఫారాల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది.
- పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫంక్షన్ హాల్స్, హోటళ్ల నుంచి ఆర్డర్లు భారీగా వస్తున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండి, సప్లై తక్కువగా ఉండటంతో ధరలు పెరుగుతున్నాయి.
- కోళ్లకు పెట్టే మేత మెుక్కజొన్న, సోయా ధరలు పెరుగడం కారణంగా నిర్వహణ ఖర్చు భారమైపోతోంది. రైతులు కోళ్ల పెంపకాన్ని చాలా వరకు తగ్గించారు.