తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొండ సురేఖపై వేటుకు లైన్ క్లియర్ అయింది. ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో…. ఆమెను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి లోక్ భవన్ (గవర్నర్ కార్యాలయం) కు లేఖ రాసినట్లు సమాచారం. ఈ లేఖ లోక్ భవన్ కార్యాలయానికి చేరటంతో… గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధికారికంగా బర్తరఫ్ చేస్తూ ఉత్తర్వులు రావాల్సి ఉంటుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురిని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ, ఆమె కుటుంబ సభ్యులు చేసిన తీవ్ర వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యవహారాల నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న కారణంతో కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ చర్యకు ఉపక్రమించారు.
చిన్నారెడ్డిపై వేటు…
ఈ బర్తరఫ్ వేటుతో పాటు ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగంలోనూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక మార్పులు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడిగా సేవలు అందిస్తున్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. ఆయనపై కూడా క్రమశిక్షణ కమిటీ నివేదికను పరిశీలించిన అధినాయకత్వం… వేటు వేసేందుకు మొగ్గు చూపింది. దీంతో ఆయన స్థానంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని ప్రణాళికా మండలి నూతన ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు వరంగల్ ప్రాంతంలో అత్యంత కీలకమైన కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) ఛైర్పర్సన్గా మాజీ రాజ్యసభ సభ్యురాలు జి. సుధారాణిని ప్రభుత్వం నియమించింది. ఇక రాష్ట్ర మహిళా కమిషన్ నూతన ఛైర్పర్సన్గా నేరెళ్ల శారదను నియమించారు.
పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని… ఎంతటి సీనియర్ నాయకులైనా చర్యలు తప్పవని ఈ నిర్ణయం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
{{/usCountry}}పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని… ఎంతటి సీనియర్ నాయకులైనా చర్యలు తప్పవని ఈ నిర్ణయం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
{{/usCountry}}