Telangana Smart Ration Card 2026 : రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేద ప్రజలకు పౌర సరఫరా వ్యవస్థ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రాష్ట్రస్థాయిలో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్నారు.

{{^htLoading}} {{/htLoading}}
సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ప్రారంభించే కార్యక్రమానికి అనుగుణంగా… ఏకకాలంలో రాష్ట్రంలోని మిగిలిన 33 జిల్లాల కేంద్రాల్లోనూ ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఒకేసారి స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలను పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
ముఖ్యమైన పాయింట్లు :
- రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 1,06,28,092 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 3,43,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతీ అర్హత కలిగిన లబ్ధిదారునికి నెలకు 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని ప్రభుత్వం సంపూర్ణ ఉచితంగా అందజేస్తోంది.
- ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పౌర సరఫరాల శాఖను, జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు.
- ఆగస్టు 15వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 3.35 గంటల మధ్య బహిరంగ సభ సాగుతుంది. అనంతరం సాయంత్రం 3.45 గంటలకు సీఎం సంగారెడ్డి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. వివిధ వర్గాలకు చెందిన నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా వేదికపై స్మార్ట్ రేషన్ కార్డులను అందించేలా చర్యలు తీసుకుంటారు.
- కార్డుల పంపిణీని ఫెయిర్ ప్రైస్ షాపులు (రేషన్ డీలర్లు) లేదా సంబంధిత విభాగాల ద్వారా నిర్వహించడం వల్ల లబ్ధిదారుల గుర్తింపును పక్కాగా ధ్రువీకరించవచ్చు. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఉండదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
- మిగిలిన జిల్లాల్లో జరిగే కార్యక్రమాల నిర్వహణ కోసం కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపాలని, నిధుల వినియోగంపై ఎలాంటి అయోమయం లేకుండా బడ్జెట్ కేటాయింపులు పూర్తి చేయాలని ఆదేశించారు.
- ఉచిత రేషన్ బియ్యం సరఫరా కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ. 14,000 కోట్లు వెచ్చిస్తోంది. దీనికి అదనంగా రైతుల నుంచి ధాన్యం సేకరణ కోసం దాదాపు రూ. 20,000 కోట్లు ఖర్చు చేస్తోంది.
- గత 2025 జనవరి 26 నుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 16,32,810 ఆహార భద్రత కార్డులను మంజూరు చేసింది. ఈ కొత్త కార్డుల ద్వారానే అదనంగా 61,08,544 మంది లబ్ధిదారులకు ఉచిత బియ్యం పథకం వర్తిస్తోంది.
- ఆగస్టు 2026 నాటికి రాష్ట్రంలో మొత్తం ఆహార భద్రత కార్డుల సంఖ్య 1,06,28,092 కు చేరింది. కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ స్మార్ట్ రేషన్ కార్డుల వ్యవస్థ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో జవాబుదారీతనం, వేగం, సౌలభ్యం మరింత పెరుగుతాయని మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}