జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పోస్టల్ ఓట్ల నుంచి 8వ రౌండ్ వరకు కూడా ఆయనే లీడ్ లో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన రౌండ్ల ప్రకారం… కాంగ్రెస్ పార్టీకి 23 వేల ఓట్లకు పైగా లీడ్ లభించింది.

పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి 39 ఓట్లు రాగా…. తొలి రౌండ్లో నవీన్యాదవ్కు 8,911 ఓట్లు దక్కాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,864 ఓట్లు దక్కగా… నవీన్ యాదవ్కు 47 ఓట్ల ఆధిక్యం వచ్చింది.ఇక సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ మంచి మెజార్టీ లభించింది. ఈ రౌండ్లో నవీన్ యాదవ్కు 9,691 ఓట్లు, మాగంటి సునీతకు 8,609 ఓట్లు పోలయ్యాయి. మూడో, నాల్గో రౌండ్ లోనూ కాంగ్రెస్ మెజార్టీ మరింత పెరిగింది.
మొదటి రౌండ్ లో కాంగ్రెస్ 47 ఓట్ల ఆధిక్యం రాగా… రెండో రౌండ్ లో 2,947 ఓట్ల లీడ్ లభించింది. మూడో రౌండ్ లో 3,100 ఓట్ల మెజార్టీ రాగా… నాల్గొ రౌండ్ లో 3,100 ఓట్ల ఆధిక్యం లభించింది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి నవీన్ యాదవ్ కి 9,147 లీడ్ దొరికింది. మరోవైపు ఐదో, 6, 7,8వ రౌండ్ లో కూడా నవీన్ యాదవ్ కే లీడ్ దక్కింది.
మరో 2 రౌండ్లు మిలిగి ఉన్నాయి. ఆయా రౌండ్లలో కూడా లీడ్ వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
మొత్తంగా చూస్తే ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాలు సూచించినట్లు ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మెజార్టీ కూడా భారీగానే ఉండేలా కనిపిస్తోంది. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల్లో సరికొత్త జోష్ ను నింపినట్లు అవుతోంది.
{{/usCountry}}మొత్తంగా చూస్తే ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాలు సూచించినట్లు ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మెజార్టీ కూడా భారీగానే ఉండేలా కనిపిస్తోంది. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల్లో సరికొత్త జోష్ ను నింపినట్లు అవుతోంది.
{{/usCountry}}