...
...
Next Story

DGP CV Anand : తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం.. ఉత్తర్వులు జారీ

DGP CV Anand : తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Apr 28, 2026, 18:15:42 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ (డీజీపీ) గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ప్రస్తుత డీజీపీ స్థానంలో ఆయన పగ్గాలు చేపట్టనున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఈ సీనియర్ అధికారికి మంచి గుర్తింపు ఉంది.

తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్(ఫైల్ ఫొటో)
తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్(ఫైల్ ఫొటో)

సీవీ ఆనంద్ తన సుదీర్ఘ సర్వీసులో అనేక కీలక పదవులను అధిష్టించారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా ఆయన చేసిన సేవలు, పరిష్కరించిన కేసుల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో, డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో ఆయన వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టారు. గతంలో ఆయన సైబరాబాద్ కమిషనర్‌గా, ఇతర కీలక పదవుల్లో పనిచేశారు.

ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్న విషయం తెలిసిందే. డీజీపీ పోస్టుకు అర్హులైన ఐపీఎస్‌ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ పంపించింది. దీనిలో సీవీ ఆనంద్‌, 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే, సౌమ్యమిశ్రా ఉన్నారు. ఇందులో అత్యంత సీనియర్‌ అయిన సీవీ ఆనంద్‌ను డీజీపీగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సీవీ ఆనంద్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. శాంతిభద్రతల నిర్వహణలో కఠినంగా ఉంటూనే, ప్రజలకు చేరువయ్యేలా పోలీసింగ్ ఉండాలని ప్రభుత్వం ఆశిస్తోంది. సీవీ ఆనంద్ నియామకంతో పోలీస్ శాఖలో మరిన్ని సంస్కరణలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సమర్థవంతమైన అధికారిగా పేరున్న సీవీ ఆనంద్ నేతృత్వంలో తెలంగాణ పోలీస్ శాఖ మరింత కొత్త నిర్ణయాలతో పనిచేస్తుందని పోలీస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. సీవీ ఆనంద్ నియామకం పట్ల పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe