...
...
Next Story

ఏసీబీ వలలో అవినీతి అనకొండ - భారీగా అక్రమాస్తుల చిట్టా..!

తెలంగాణ ఏసీబీ వలకు మరో పెద్ద తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో మహబూబ్ నగర్ అదనపు రవాణా కమిషనర్ కిషన్ నాయక్‌ను అరెస్ట్ చేసింది. హైదరాబాద్‌లో ఆరు చోట్ల, నిజామాబాద్‌లో మూడు చోట్ల, నారాయణ ఖేడ్‌లో మూడు చోట్ల సోదాలు చేపట్టగా.. భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.

Published on: Dec 24, 2025, 10:21:38 IST
Advertisement

ఏసీబీ వలకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. రవాణాశాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న కిషన్… భారీగా అక్రమాస్తులను కూడబెట్టాడు. అక్రమార్జనలో ఆరితేరిన నేపథ్యంలో…. వ్యవహారం ఏసీబీ దృష్టికి వెళ్లింది. పక్కాగా సమాచారం అందుకున్న అధికారులు…. ఏకకాలంలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు. దీంతో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం - భారీగా అక్రమాస్తుల చిట్టా..!
ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం - భారీగా అక్రమాస్తుల చిట్టా..!

ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీబీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ గా పని చేస్తున్న కిషన్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఆయన నివాసంతో పాటుగా ఆయన బంధువులు మరియు సహచరులకు చెందిన మరో 11 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.

భారీగా ఆస్తుల చిట్టా…!

ఈ సోదాల్లో నిజామాబాదులో లహరి ఇంటర్నేషనల్ హోటల్‌లో 50 శాతం వాటా, 3000 చదరపు గజాల రాయల్‌ఓక్ ఫర్నిచర్ గల స్థలం, అశోక టౌన్‌షిప్‌లో 2 ఫ్లాట్లు మరియు 10 ఎకరాల వాణిజ్య భూమి ఉన్నట్లు తేలింది.

సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక పాలీహౌస్ మరియు షెడ్, రెండు వాహనాలు (ఇన్నోవా క్రిస్టా మరియు హోండా సిటీ) మరియు 1000.4 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటుగా రూ.1.37 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌ కలిగి ఉన్నట్లు విచారణ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులన్నింటి మొత్తం విలువ సుమారు రూ.12.72 కోట్లు (దస్తవేజు విలువ ప్రకారం) ఉండగా… బహిరంగ మార్కెట్ లో అయితే రూ. 200 కోట్లకుపైగానే ఉండే అవకాశం ఉంది.

ఇక ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకుండా వివిధ సామాజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe