ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్లో చేరడానికి దరఖాస్తుల గడువును పొడిగించారు. వచ్చే జనవరిలో జరిగే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్లో చేరాలనుకునే వారి దరఖాస్తుల గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు అటవీ శాఖ తెలిపింది. ఇప్పటివరకు జనవరి 17 నుండి 24 వరకు జరిగే పులుల అంచనా సమయంలో పులుల సంఖ్య, అటవీ రకం డేటా సేకరణ కోసం స్వచ్ఛందంగా పనిచేయడానికి దాదాపు 3,800 మంది సైన్ అప్ చేశారని అటవీ శాఖ విభాగం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

ప్రభుత్వ సిబ్బంది, అధికారులు స్వచ్ఛందంగా పనిచేయవచ్చు. కానీ పులుల అంచనా ప్రక్రియకోసం సెలవు తీసుకొవాల్సి ఉంటుంది. దీనికోసం వారి స్వంత సమయం కేటాయించాలి. ఆసక్తి ఉన్నవారు https://tinyurl.com/aite2026tg ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా aite2026tg@gmail.com కు ఇమెయిల్ పంపవచ్చు. 9803338666కు వాట్సాప్ ద్వారా సందేశం పంపవచ్చు. 18004255364, 04023231440కు కాల్ చేయవచ్చు.
ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026 కార్యక్రమాన్ని జనవరి 17 నుంచి జనవరి 24 వరకు నిర్వహించనున్నారు. స్వచ్ఛంద సేవకులు, యువకులు, విద్యార్థులు పులుల గణన కార్యక్రమంలో పాల్గొనాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. దరఖాస్తు చేసుకున్న వాలంటీర్లకు అవసరమైన శిక్షణ ఇస్తారు. అడవుల్లో వన్యప్రాణుల గణనకు ఎర్న్ యువర్ స్ట్రేప్స్ యాప్లో కాగిత రహితంగా పులుల గణన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
నిజానికి పులుల గణన కోసం ముందుగా నవంబర్ 22 వరకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఆ తర్వాత నవంబర్ 30 వరకు పెంచారు. శాకాహార జంతువులతో పాటు మాంసాహార జంతువుల గణన ఉండనుంది. పులుల పాదముద్రలు, మలం, కెమెరా ట్రాప్స్ అమర్చడం, ఇతర సాంకేతిక పద్ధతులను ఉయోగించడంవంటి వాటిపై శిక్షణ ఇస్తారు. పులుల సంఖ్యను అత్యంత కచ్చితంగా లెక్కిస్తారు అధికారులు.
అమ్రాబాద్, కవ్వాల్ లాంటి టైగర్ రిజర్వ్లతోపాటు అన్ని రిజర్వ్ ఫారెస్ట్లు, ఏటూరునాగారం, పాకాల, ప్రాణహిత, శివరం, పోచారం, కిన్నెరసాని, మంజీరాలోని ఏడు వన్యప్రాణుల అభయారణ్యాలతో సహా అన్ని అటవీ ప్రాంతాలలో లెక్కింపు జరుగుతుంది. ఈ మేరకు పులులు సంచరించే అటవీ ప్రాంతాల్లో డేటా సేకరణ ఉంటుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, శాస్త్రీయ పద్ధతులతో ప్రతీ పులిని గుర్తించి, వాటి వివరాలను నమోదు చేస్తారు.
{{/usCountry}}అమ్రాబాద్, కవ్వాల్ లాంటి టైగర్ రిజర్వ్లతోపాటు అన్ని రిజర్వ్ ఫారెస్ట్లు, ఏటూరునాగారం, పాకాల, ప్రాణహిత, శివరం, పోచారం, కిన్నెరసాని, మంజీరాలోని ఏడు వన్యప్రాణుల అభయారణ్యాలతో సహా అన్ని అటవీ ప్రాంతాలలో లెక్కింపు జరుగుతుంది. ఈ మేరకు పులులు సంచరించే అటవీ ప్రాంతాల్లో డేటా సేకరణ ఉంటుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, శాస్త్రీయ పద్ధతులతో ప్రతీ పులిని గుర్తించి, వాటి వివరాలను నమోదు చేస్తారు.
{{/usCountry}}ఎన్ని పులులు ఉన్నాయో స్పష్టంగా తెలుసుకునేందుకు ప్రభుత్వం నాలుగేళ్లకోసారి గణన చేస్తోంది. మరోవైపు మహారాష్ట్ర సరిహద్దులని తాడోబా, తిప్వేశ్వర్, ఇంద్రావతి అడవుల నుంచి ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల్లోకి పులులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం జన్నారంలో కవ్వాల్ పులల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.