తెలంగాణలో నవంబర్ 20 నుంచి పులుల గణన.. లెక్కింపునకు వాలంటీర్లను తీసుకుంటారా?
తెలంగాణలో అటవీ శాఖ నవంబర్ 20 నుంచి పులుల గణనను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. వేసవికి ముందే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు వేశారు.
తెలంగాణలోని అడవుల్లో పులుల సంఖ్యను లెక్కించేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. నవంబర్ 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పులుల లెక్కింపు ప్రక్రియ ముదలు కానుంది. నిజానికి ఈ గణన చాలా రోజుల తర్వాత ప్రారంభం కావాల్సి ఉండేది. కానీ చలికాలం కావడంతో ఈ వాతావరణంలో పులులు, ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంటుందని ముందుగానే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ లెక్కింపుతో పెద్దపులుల ప్రస్తుత స్థితి, సంరక్షణ అంచనా వేసేందుకు వీలుగా ఉంటుంది.

ఈ గణన కోసం అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. లెక్కింపు పద్ధతులపై అధికారులకు శిక్షణ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రతీ జిల్లా నుంచి ఇద్దరు చొప్పున అధికారులు ఈ శిక్షణలో ఉంటారు. పులుల పాదముద్రలు, మలం, కెమెరా ట్రాప్స్ అమర్చడం, ఇతర సాంకేతిక పద్ధతులను ఉయోగించడంవంటి వాటిపై శిక్షణ ఇస్తారు. పులుల సంఖ్యను అత్యంత కచ్చితంగా లెక్కిస్తారు అధికారులు.
అమ్రాబాద్, కవ్వాల్ లాంటి టైగర్ రిజర్వ్లతోపాటు అన్ని రిజర్వ్ ఫారెస్ట్లు, ఏటూరునాగారం, పాకాల, ప్రాణహిత, శివరం, పోచారం, కిన్నెరసాని, మంజీరాలోని ఏడు వన్యప్రాణుల అభయారణ్యాలతో సహా అన్ని అటవీ ప్రాంతాలలో లెక్కింపు జరుగుతుంది. ఈ మేరకు పులులు సంచరించే అటవీ ప్రాంతాల్లో డేటా సేకరణ జరుగుతుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, శాస్త్రీయ పద్ధతులతో ప్రతీ పులిని గుర్తించి, వాటి వివరాలను నమోదు చేయనున్నారు. ఈ మేరకు నవంబర్ 20వ తేదీ నుంచి పులుల గణన ముదలుకానుంది. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం లెక్కింపు జరుగుతుంది.
అయితే మరో వార్త కూడా వినిపిస్తుంది. పులుల గణనకు వాలంటీర్లను పిలిచే అవకాసం ఉందని తెలుస్తోంది. అమ్రాబాద్, కవాల్లోని రెండు పులుల అభయారణ్యాలలో సిబ్బంది కొరత ఎదుర్కొంటున్న అటవీ శాఖ, నవంబర్లో జరిగే పులుల లెక్కింపును స్వచ్ఛంద సేవకులను ఆహ్వానించాలని యోచిస్తోందట.
ఇది వారికి అడవిలోకి వెళ్లడమే కాకుండా, వన్యప్రాణులను వాస్తవంగా పరిశీలించడానికి, పులి, అడవులు, మిగిలిన వన్యప్రాణులను రక్షించే ప్రయత్నాలకు తెలుసుకునేందుకు ఉపయోగపడనుంది. ప్రకృతి, వన్యప్రాణులతో సంబంధం ఉన్న NGOలతో అక్టోబర్ 31న అటవీ శాఖ ఒక సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత స్వచ్ఛంద సేవా ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎంపికైన వారందరికీ ఎలా నడవాలి? లెక్కింపు సమయంలో ఏం చేయాలి? ఎలా చేయాలో శిక్షణ ఇస్తారు. అయితే వాలంటీర్లను పులుల గణనలో భాగం చేసే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


