రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన తొలి పార్టీ కాంగ్రెస్సేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. అయితే 2026 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

ఆ రెండింటినీ కలిపి, పాత జనాభా లెక్కల ఆధారంగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం కుట్ర తప్ప మరేమీ కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని పేర్కొంటూ, ఆరు నెలల్లో ఈ రిజర్వేషన్లను కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
'నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చాలా ప్రమాదకరమైన దిశగా సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్న రాష్ట్రాలకు, దక్షిణాదికి అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయి. ఉత్తరాదిలో సరైన అమలు లేకపోవడం వల్ల జనాభా పెరిగింది. జనాభా ఆధారంగా సీట్ల సంఖ్యను పెంచకూడదని దక్షిణాది రాష్ట్రాలు స్పష్టంగా తెలియజేశాయి.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
దక్షిణ రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో రాష్ట్రాల్లో సీట్లను 50 శాతం పెంచుతామని హామీ ఇస్తూ కేంద్రం మరో ప్రతిపాదనతో ముందుకు వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. సీట్లను పెంచాలనుకుంటే కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ఏ బిల్లునైనా రాష్ట్రాల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ప్రవేశపెట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు.
పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే విషయంలో కేంద్రం తొందరపడకూడదని రేవంత్ రెడ్డి సూచించారు. సీట్ల సంఖ్య విషయంలో దక్షిణ, ఉత్తర ప్రాంతాల మధ్య అంతరం సరిగా లేదని పేర్కొంటూ, నియోజకవర్గాల పునర్విభజనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు.
{{/usCountry}}పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే విషయంలో కేంద్రం తొందరపడకూడదని రేవంత్ రెడ్డి సూచించారు. సీట్ల సంఖ్య విషయంలో దక్షిణ, ఉత్తర ప్రాంతాల మధ్య అంతరం సరిగా లేదని పేర్కొంటూ, నియోజకవర్గాల పునర్విభజనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు.
{{/usCountry}}'డీలిమిటేషన్ తర్వాత దక్షిణాదిలో 195 లోక్సభ స్థానాలకు చేరుకుంటాయి. ఉత్తర భారతదేశంలో సీట్లు 620కి అవుతాయి. దీంతో ఉత్తర, దక్షిణాది మధ్య ప్రస్తుతం ఉన్న 210 సీట్ల అంతరం 412కి అవుతుంది. బీజేపీ ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు అస్సలు ప్రాధాన్యం దక్కడం లేదు. సీట్లు పెంచాలనుకుంటే.. అఖిలపక్షాన్ని పిలిచి మాట్లాడాలి. ఏ ప్రాదిపదికన 50 శాతం సీట్లు పెంచుతారు? అలా పెంచితే.. దక్షిణాది మధ్య తీవ్ర అంతరం ఏర్పడుతుంది. దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షను మరింత పెంచేలా బీజేపీ వ్యవహరిస్తోంది.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.