Dhanbad Coimbatore Amrit Bharat Express : తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మంచి శుభవార్త అందించింది. జార్ఖండ్లోని ధన్బాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్ మధ్య నూతన 'అమృత్ భారత్ వారపు ఎక్స్ప్రెస్' (రైలు నంబర్లు 22363/22364) ప్రారంభానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైలు సేవలు ధన్బాద్ నుంచి ఆగస్టు 22, 2026న, కోయంబత్తూర్ నుంచి ఆగస్టు 25, 2026న ప్రారంభమయ్యాయి.

ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు బల్హార్షా, సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తిరుప్పూర్ వంటి కీలక స్టేషన్ల మీదుగా సాగుతుంది. తెలంగాణ, ఏపీ మీదుగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ సర్వీసు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.
ట్రైన్ నంబర్ 22363 (ధన్బాద్ - కోయంబత్తూర్ అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ ) : ఈ రైలు ప్రతి శనివారం సాయంత్రం 16:10 గంటలకు ధన్బాద్లో బయలుదేరి, సోమవారం సాయంత్రం 18:30 గంటలకు కోయంబత్తూర్ చేరుకుంటుంది.
- గోమో : శనివారం సాయంత్రం 16:40 / 16:42
- బల్హార్షా : ఆదివారం రాత్రి 21:10 / 21:15
- సిర్పూర్ కాగజ్నగర్ : రాత్రి 22:04 / 22:05
- మంచిర్యాల : రాత్రి 22:44 / 22:45
- పెద్దపల్లి : రాత్రి 23:09 / 23:10
- వరంగల్ : సోమవారం అర్ధరాత్రి 00:08 / 00:10
- మహబూబాబాద్ : రాత్రి 01:09 / 01:10
- ఖమ్మం : రాత్రి 01:49 / 01:50
- విజయవాడ : తెల్లవారుజామున 03:45 / 03:55
- తిరుప్పూర్ : సోమవారం సాయంత్రం 17:03 / 17:05
- కోయంబత్తూర్ : సోమవారం సాయంత్రం 18:30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
ట్రైన్ నంబర్ 22364 (కోయంబత్తూర్ - ధన్బాద్ అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 07:50 గంటలకు కోయంబత్తూర్లో బయలుదేరుతుంది. గురువారం మధ్యాహ్నం 13:00 గంటలకు ధన్బాద్ చేరుకుంటుంది.
- తిరుప్పూర్ : మంగళవారం ఉదయం 08:28 / 08:30
- విజయవాడ : మంగళవారం రాత్రి 21:40 / 21:50
- ఖమ్మం : రాత్రి 23:39 / 23:40
- మహబూబాబాద్ : బుధవారం అర్ధరాత్రి 00:09 / 00:10
- వరంగల్ : రాత్రి 01:18 / 01:20
- పెద్దపల్లి : తెల్లవారుజామున 03:59 / 04:00
- మంచిర్యాల : ఉదయం 04:49 / 04:50
- సిర్పూర్ కాగజ్నగర్ : ఉదయం 05:19 / 05:20
- బల్హార్షా : ఉదయం 07:00 / 07:05
- గోమో : గురువారం ఉదయం 11:48 / 11:50
- ధన్బాద్ : గురువారం మధ్యాహ్నం 13:00 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
ట్రైన్ నంబర్ 22364 (కోయంబత్తూర్ - ధన్బాద్ అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 07:50 గంటలకు కోయంబత్తూర్లో బయలుదేరుతుంది. గురువారం మధ్యాహ్నం 13:00 గంటలకు ధన్బాద్ చేరుకుంటుంది.
- తిరుప్పూర్ : మంగళవారం ఉదయం 08:28 / 08:30
- విజయవాడ : మంగళవారం రాత్రి 21:40 / 21:50
- ఖమ్మం : రాత్రి 23:39 / 23:40
- మహబూబాబాద్ : బుధవారం అర్ధరాత్రి 00:09 / 00:10
- వరంగల్ : రాత్రి 01:18 / 01:20
- పెద్దపల్లి : తెల్లవారుజామున 03:59 / 04:00
- మంచిర్యాల : ఉదయం 04:49 / 04:50
- సిర్పూర్ కాగజ్నగర్ : ఉదయం 05:19 / 05:20
- బల్హార్షా : ఉదయం 07:00 / 07:05
- గోమో : గురువారం ఉదయం 11:48 / 11:50
- ధన్బాద్ : గురువారం మధ్యాహ్నం 13:00 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ముఖ్యమైన పారిశ్రామిక, వ్యాపార నగరాలను అనుసంధానిస్తూ సాగే ఈ రైలు సర్వీసు ఉంటుంది. ఫలితంగా వ్యాపారులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.