తెలంగాణలో ఎల్పీజీపై జనాల్లో ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఓ వైపు ప్రభుత్వం ఎల్పీజీ కొరత లేదని ప్రకటనలు జారీ చేస్తున్నా.. ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల సిలిండర్లు బుక్ అయ్యాయి. ఇప్పుడు వాటిని డెలివరీ చేసేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

తెలంగాణలో 15 లక్షలకుపైగా సిలిండర్ల డెలివరీ పెండింగ్లో ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కూడా ఇన్ని బుకింగ్స్కు ఒక కారణంగా చెప్పవచ్చు. వీటన్నింటినీ సరఫరా చేసేందుకు వారం రోజులపైనే పడుతుంది. లాక్ సిస్టమ్, సాఫ్ట్వేర్ సమస్యలతో గ్యాస్ బుకింగ్స్ సంఖ్య తగ్గింది. అయితే సరఫరా వ్యవస్థలో లోపాలతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం. బుక్ చేసిన తర్వాత కస్టమర్ ఇంటికి సిలిండర్ వచ్చేందుకు రెండుమూడు వారాలపైనే పడుతుంది.
తెలంగాణలో 1.30 కోట్ల గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. నార్మల్ డేస్లో 2.15 లక్షల బుకింగ్స్ ఉంటాయి. అయితే యుద్ధానికి ముందు రోజూవారీ పెండింగ్ 3.50 లక్షల ఉండేవి. ఇందులో 2.15 లక్షల సిలిండర్లు సరఫరా జరిగేవి. మిగిలినవి మరుసటి రోజు చేస్తుండేవారు. ఇప్పుడు డెలివరీ కావాల్సినవి 15 లక్షలు ఉన్నాయి.
సిలిండర్ల డెలివరీ వేగంగా జరిగితే ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉంది. నిజానికి పశ్చిమాసియా ఉద్రిక్తతలు మెుదలై.. సోషల్ మీడియాలో ఎల్పీజీ కొరత అంటూ ప్రచారం అవ్వడంతో బుకింగ్స్ ఎక్కువ అయ్యాయి. ఇదే సమయంలో సిస్టమ్ లాక్ పద్ధతిని అమలులోకి తెచ్చింది కేంద్రం. బుకింగ్ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో సింగిల్ సిలిండర్ ఉంటే... 25 రోజులు, డబుల్ సిలిండర్లు ఉంటే 35 రోజుల లాక్ సిస్టమ్ అమలు చేస్తోంది.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా రవాణాకు అంతరాయం ఏర్పడి, సరఫరా కొరత తలెత్తిన నేపథ్యంలో మరోవైపు ఎల్పీజీ సిలిండర్ల నిల్వలను అరికట్టడానికి అధికారులు దాడులను ముమ్మరం చేశారు. ఇటీవల హైదరాబాద్లోని ఒక స్మశానవాటికలో సుమారు 400 సిలిండర్లు లభ్యమయ్యాయి. అక్కడ పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రమేయం ఉన్న పంపిణీదారుడిని సస్పెండ్ చేశారు.
{{/usCountry}}ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా రవాణాకు అంతరాయం ఏర్పడి, సరఫరా కొరత తలెత్తిన నేపథ్యంలో మరోవైపు ఎల్పీజీ సిలిండర్ల నిల్వలను అరికట్టడానికి అధికారులు దాడులను ముమ్మరం చేశారు. ఇటీవల హైదరాబాద్లోని ఒక స్మశానవాటికలో సుమారు 400 సిలిండర్లు లభ్యమయ్యాయి. అక్కడ పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రమేయం ఉన్న పంపిణీదారుడిని సస్పెండ్ చేశారు.
{{/usCountry}}నిందితులు శ్మశానవాటిక నుండి వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్లను ప్రస్తుత మార్కెట్ ధర కన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. సుమారు రూ. 2,100 ఖరీదు చేసే ఒక వాణిజ్య సిలిండర్ను రూ. 6,000 వరకు అమ్మినట్లు తేలింది.
స్వాధీనం చేసుకున్న సిలిండర్లు, నిందితులు ఉపయోగించిన కొన్ని వాహనాల మొత్తం విలువ దాదాపు రూ. 22 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవని ప్రభుత్వం చెబుతున్నా.. చాలా మంది పట్టించుకోవడం లేదు.