మా డాడీ ఎవరో తెలుసా? డ్రంక్ అండ్ డ్రైవ్‌పై సజ్జనార్ సీరియస్ వార్నింగ్

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ గురించి హైదరాబాద్ సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పట్టుబడినవారు పలుకుబడిని ఉపయోగించాలని ప్రయత్నించవద్దని హెచ్చరించారు.

Published on: Dec 28, 2025, 15:25:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ పోలీసుల జీరో-టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటిస్తూ, నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా పోస్టుల ద్వారా మద్యం తాగి వాహనాలు నడపకూడదని గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. మద్యం సేవించే వాహనదారులు డ్రైవింగ్‌ను పూర్తిగా నివారించాలన్నారు. దానికి బదులుగా క్యాబ్‌ను ఎంచుకోవాలని సజ్జనార్ సూచించారు, లాయర్‌ను కాదని చెప్పారు.

సజ్జనార్
సజ్జనార్

నూతన సంవత్సర సమయంలో పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. రాజకీయ లేదా వ్యక్తిగత సంబంధాలను ఉదహరిస్తూ పోలీసులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే వారిని సజ్జనార్ హెచ్చరించారు. వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తున్నప్పటికీ, నేరస్థులపై చట్టం ప్రకారం కేసు నమోదు అవుతుందని చెప్పారు. తదుపరి విచారణ తేదీన కోర్టులో మళ్లీ పోలీసులను కలవవచ్చని పేర్కొన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినవారు పలుకుబడిని ఉపయోగించాలని ప్రయత్నించకూడదని సజ్జనార్ హెచ్చరించారు. 'మా డాడీ ఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా? అన్న ఎవరో తెలుసా? అని మా అధికారులను అడగొద్దని చెప్పారు. మీ ప్రైవసీకి మర్యాద ఇస్తామని పేర్కొన్నారు. వాహనం పక్కన పెట్టి డేట్ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందామని వెల్లడించారు. మద్యం తాగి వాహనం నడిపితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

#DoNotDrinkAndDrive వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి ఎక్స్‌లో సజ్జనార్ పోస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ప్రజా భద్రతను నిర్ధారించడానికి ఎటువంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనం నడపడంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More