...
...
Next Story

కస్టమర్లు తాగి వాహనాలు నడపకుండా చూడాలి.. క్యాబ్‌ బుకింగ్‌లను తిరస్కరిస్తే చర్యలు

నూతన సంవత్సర వేడుకలకు ముందు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వివరణాత్మక ట్రాఫిక్ సలహాను జారీ చేశారు. ఉల్లంఘనలపై, ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం, ప్రమాదకరమైన డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Published on: Dec 30, 2025, 11:44:58 IST
Advertisement

నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ప్రజా ప్రయోజనాల కోసం సైబరాబాద్ పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. అడ్వైజరీ ప్రకారం.. క్యాబ్, టాక్సీ, ఆటోరిక్షా ఆపరేటర్లు యూనిఫాంలో ఉండాలి. చెల్లుబాటు అయ్యే పత్రాలను తమతో కలిగి ఉండాలి. ప్రయాణికులకు రైడ్‌లను తిరస్కరించకూడదు. రైడ్ కోసం బుకింగ్ చేసుకుంటే దాన్ని తిరస్కరిస్తే.. మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం జరిమానాలు ఉంటాయి. ఈ చలాన్ రూపంలో జరిమానా పడుతుంది.

సైబరాబాద్ పోలీసుల మార్గదర్శకాలు
సైబరాబాద్ పోలీసుల మార్గదర్శకాలు

ప్రయాణికులు ఇటువంటి సంఘటనలను 9490617346 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. డ్రైవర్లు దురుసుగా ప్రవర్తించడం, అధిక ఛార్జీలు వసూలు చేయకూడదని పోలీసులు హెచ్చరించారు.

బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లు తమ ప్రాంగణంలో మద్యం సేవించిన తర్వాత మద్యం సేవించిన వ్యక్తులు వాహనాలు నడపడానికి అనుమతించకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు హెచ్చరించారు. తెలిసి లేదా నిర్లక్ష్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడానికి అనుమతి ఇచ్చిన సంస్థలపై నేరానికి ప్రేరేపించినందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే పరిణామాల గురించి కస్టమర్లకు అవగాహన కల్పించాలి. అవసరమైన చోట ప్రత్యామ్నాయ రవాణాను ఏర్పాటు చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు.

రాంగ్ సైడ్ డ్రైవింగ్, అనధికార పార్కింగ్, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా రైడింగ్ వంటి ఉల్లంఘనలను గుర్తించడానికి ప్రత్యేక నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిని కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించి విచారణ చేపడతారు. రాత్రి 8 గంటల నుండి సైబరాబాద్ పరిధిలో విస్తృతంగా మద్యం తాగి డ్రైవింగ్ చేసేవారిపై తనిఖీలు చేపడతారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe