Electric RTC Bus Fire Accident : కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రయాణంలో ఉండగా ఒక్కసారిగా సాంకేతిక లోపంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. అయితే…. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కరీంనగర్ డిపోనకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఆదివారం ఉదయం 8:00 గంటల ప్రాంతంలో 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు బయలుదేరింది. బస్సు కరీంనగర్ శివార్లలోని అలుగునూరు దాటిన తర్వాత కాకతీయ కాలువ సమీపంలోకి చేరుకోగానే…. ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు, మంటలు రావడం ప్రారంభమైంది.
బస్సులో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ ప్రశాంత్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బస్సును రోడ్డు పక్కన సురక్షితమైన ప్రదేశంలో నిలిపివేశారు. వెంటనే బస్సు ప్రధాన ద్వారంతో పాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ (అత్యవసర ద్వారాలు) గేట్లను తెరిచారు. ప్రయాణికులందర్నీ సామాన్లతో సహా హుటాహుటిన కిందకు దిగిపోవాలని గట్టిగా అరిచారు. డ్రైవర్ హెచ్చరికతో అప్రమత్తమైన ప్రయాణికులు ఒకరినొకరు తోసుకోకుండా వేగంగా బస్సులో నుంచి బయటకు దూకేశారు.
అగ్నికి బూడిదైన బస్సు
ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించిన తర్వాత…. డ్రైవర్, కండక్టర్ బస్సులో అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలను (ఫైర్ ఎక్స్టింగిషర్స్) ఉపయోగించి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే బ్యాటరీ లోపం వల్ల మంటలు తీవ్రరూపం దాల్చాయి. కేవలం నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి దట్టంగా వ్యాపించాయి.
స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో, ఫైర్ సిబ్బంది వాహనంతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
{{/usCountry}}స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో, ఫైర్ సిబ్బంది వాహనంతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
{{/usCountry}}