కరీంనగర్ టు తిరుమల..! ఈ నెలలోనే జర్నీ,ఈ IRCTC టూర్ ప్యాకేజీ చూడండి

కరీంనగర్ నుంచి తిరుమల వెళ్లే వారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం టూర్ ప్యాకేజీ వచ్చేసింది. శ్రీవారి దర్శనంతో పాటు శ్రీకాళహస్తీని కూడా చూడొచ్చు. ఈనెల 20వ తేదీన జర్నీ ఉంటుంది. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

Published on: Nov 12, 2025 1:06 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా..? బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ ప్లాన్ చేసుకునే వారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ‘తిరుపతి ఫ్రమ్ కరీంనగర్’ పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్‌లో తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలను చూడొచ్చు.

కరీంనగర్ - తిరుమల టూర్ ప్యాకేజీ
కరీంనగర్ - తిరుమల టూర్ ప్యాకేజీ

ఈ ప్యాకేజీ ప్రస్తుతం 20 నవంబర్, 2025వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ డేట్ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ (https://www.irctctourism.com/ ) లో చూడొచ్చు.

జర్నీ కోసం టికెట్లు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. అయితే కేవలం కరీంనగర్ మాత్రమే కాకుండా… వరంగల్, ఖమ్మం రైల్వే స్టేషన్ లో కూడా ప్రయాణికులు ట్రైన్ ఎక్కొచ్చు.

టూర్ షెడ్యూల్ వివరాలు:

  • కరీంనగర్ నుంచి (ట్రైన్ నెంబర్ 12762) రాత్రి 07.15 గంటలకు రైలు బయల్దేరుతుంది. పెద్దపల్లి స్టేషన్ వద్ద ఎక్కేవారు రాత్రి 8.05 నిమిషాలకు, వరంగల్ వద్ద రాత్రి 9.15, ఖమ్మం స్టేషన్ కు 11 గంటలకు రైలు స్టేషన్ కు చేరుకుంటుంది. రాత్రి మొత్తం జర్నీలో ఉంటారు.
  • రెండో రోజు ఉదయం 7.50 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత.. ఫ్రెషప్ అవుతారు. అక్కడ్నుంచి తిరుచానూరు వెళ్తారు. శ్రీకాళహస్తి దర్శనం ఉంటుంది. రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు.
  • తెల్లవారుజామునే తిరుమలకు చేరుకుంటారు. క్యూ లైన్ ద్వారా దర్శనానికి వెళ్తారు. రాత్రి 8.15 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి జర్నీ ఉంటుంది. రాత్రంతా ప్రయాణంలో ఉంటారు.
  • చివరి రోజు తెల్లవారుజాము ఉదయం 03.26 గంటలకు ఖమ్మం, 04.41 గంటలకు వరంగల్, 05.55 గంటలకు పెద్దపల్లి, ఉదయం 08.40 నిమిషాలకు కరీంనగర్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

కరీంనగర్ - తిరుమల టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... సింగిల్ షేరింగ్ కు రూ. 14,030 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 10,940ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.9160గా ఉంది. కంఫ్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. ఐదు నుంచి 11 ఏళ్ల చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు.

ఇదే ప్యాకేజీ సంబంధించి స్టాండర్ట్ క్లాస్ లో టికెట్ ధరలు చూస్తే…. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7250, డబుల్ షేరింగ్ కు రూ. 9030, సింగిల్ షేరింగ్ కు రూ. 12,120గా నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు 9701360701 / 9281030712 నెంబర్లను సంప్రదింవచ్చు.

News/Telangana/కరీంనగర్ టు తిరుమల..! ఈ నెలలోనే జర్నీ,ఈ IRCTC టూర్ ప్యాకేజీ చూడండి
News/Telangana/కరీంనగర్ టు తిరుమల..! ఈ నెలలోనే జర్నీ,ఈ IRCTC టూర్ ప్యాకేజీ చూడండి