Konda Surekha Social Media Post : నిరీక్షణ ముగిసింది... అతి త్వరలోనే కీలక నిర్ణయం - కొండా సురేఖ పోస్ట్!
Konda Surekha Social Media Post : ఇక నిరీక్షణ ముగిసిందని, అతి త్వరలోనే ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు మాజీ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
Konda Surekha Social Media Post : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అధినాయకత్వం నిర్ణయంతో కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ… ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే…. ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ ప్రకటన చేశారు. అతి త్వరలోనే తాను ఒక కీలక నిర్ణయాన్ని వెల్లడించబోతున్నట్లు పేర్కొన్నారు.

నిరీక్షణ ముగిసింది - కొండా సురేఖ పోస్ట్
"ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను," అని కొండా సురేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె చేసిన ఈ చిన్న పోస్ట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గత కొంతకాలంగా కొండా సురేఖ పొలిటికల్ మూవ్మెంట్స్పై పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో స్వయంగా ఆమె "కీలక నిర్ణయం" అంటూ అధికారికంగా ప్రకటన చేయడంతో…. ఆమె రాబోయే రాజకీయ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపై ముమ్మర చర్చ సాగుతోంది. ఆమె పార్టీ మారుతారా? లేదా మరేదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా దంపతుల పాత్ర అత్యంత ప్రాధాన్యమైనది. వారి రాజకీయ నిర్ణయం హస్తం పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సురేఖ చేయబోయే ప్రకటన ఏమిటనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

