తెలంగాణ : గుడిలోని పూల మొక్కల మధ్య గంజాయి సాగు - అయ్యగారి అసలు బాగోతం బట్టబయలు..!
బంతి పువ్వుల మొక్కల్లో గంజాయి మొక్కలు పెంచుతున్న పూజారిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని పంచగం గ్రామంలో వెలుగు చూసింది. రూ.70 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఓ గ్రామంలో ఆలయం ఉంది… అక్కడ పూజారి ఉంటాడు. అక్కడే ఉన్న ఖాళీ స్థలంలో పూలమొక్కలను పెంచాడు. కట్ చేస్తే అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఆశతో పూల మొక్కల మధ్యలో గంజాయిని కూడా సాగు చేశాడు. విషయం కాస్త పోలీసుల వరకు చేరటంతో…. ఎట్టకేలకు అయ్యగారి బాగోతం బయటపడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.

నారాయణకేడ్ మండలం పంచగావ్ గ్రామంలో నర్సయ్య మహారాజ్ అనే బాబా ఆలయంలో పూజారిగా పని చేస్తుంటాడు. ఆలయ ప్రాంగణంలో బంతి పూల సాగు చేస్తున్నట్లు నమ్మిస్తూ, వాటి మధ్యలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా పూల మొక్కల మాటున ఈ అక్రమ దందాను సాగిస్తున్న నాగయ్యను టాస్క్ ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ దాడుల్లో భారీగా గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
సుమారు రూ.70 లక్షల విలువైన 17.741 కిలోల బరువు కలిగిన 685 గంజాయి మొక్కలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నర్సయ్య మహారాజ్ ను అరెస్ట్ చేయగా… పలువురు వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఈ గంజాయిని ఎక్కడికి సరఫరా చేస్తున్నాడు…? దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూజారి ముసుగులో ఉంటే ఇలా చేయటంపై స్థానికులు విస్మయానికి గురవుతున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

