రాబోయే పండుగల వేళ ప్రయాణికులకు అలర్ట్ - హైటెక్ సిటీ స్టేషన్‌లో రైళ్ల హాల్టింగ్ గడువు పొడిగింపు! లిస్ట్ ఇదే

దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల రద్దీ దృష్ట్యా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల తాత్కాలిక నిలుపుదల గడువును దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. ప్రయాణికులు బోర్డింగ్ పాయింట్ ఉచితంగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది.

Published on: Sep 2, 2026, 08:37:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాబోయే పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా…. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల తాత్కాలిక నిలుపుదల (Stoppage) గడువును పొడిగించింది.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్
రైల్వే ప్రయాణికులకు అలర్ట్

పండుగల సమయంలో సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీని నియంత్రించడంతో పాటు, ఐటీ ప్రాంతంలో నివసించే వారికి నేరుగా ప్రయాణ సౌలభ్యం కల్పించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.

దసరా. దీపావళి పండుగల రద్దీ కోసం 2026 అక్టోబర్ 27 నుండి 2026 నవంబర్ 10 వరకు (15 రోజుల పాటు) రైళ్ల నిలుపుదల కొనసాగుతుంది. ఆ తర్వాత క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు 2026 డిసెంబర్ 18 నుండి 2027 జనవరి 19 వరకు (33 రోజుల పాటు) ఈ తాత్కాలిక హాల్టింగ్ సదుపాయాన్ని పొడిగించారు.

గతంలో ఈ రైళ్లకు 2026 అక్టోబర్ 9 నుండి 2026 అక్టోబర్ 26 వరకు (18 రోజులు) మాత్రమే హాల్ట్ కేటాయిస్తూ ముందస్తు ప్రకటన విడుదల చేశారు. అయితే ప్రయాణికుల అవసరాలను గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే…. తాజాగా రెండు విడతలుగా నిలుపుదల కాలాన్ని విస్తరించింది.

హైటెక్ సిటీలో నిలిచే ట్రైన్….

  • నర్సాపూర్ - లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ - 17255)
  • లింగంపల్లి - నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్- 17256)
  • కాకినాడ టౌన్ - లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య - 12775)
  • లింగంపల్లి - కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ - 12776)

ఉచితంగా బోర్డింగ్ పాయింట్…

ఇప్పటికే లింగంపల్లి స్టేషన్ నుంచి ప్రయాణించేందుకు రిజర్వేషన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో వెసులుబాటు కల్పించింది. పైన పేర్కొన్న పొడిగించిన తేదీలలో ప్రయాణించే వారు, రూపాయి కూడా అదనపు రుసుము చెల్లించకుండా నియమావళి ప్రకారం తమ 'బోర్డింగ్ పాయింట్'ను లింగంపల్లి నుండి హైటెక్ సిటీ స్టేషన్‌కు ఉచితంగా మార్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More