...
...
Next Story

TMREIS : మైనారిటీ విద్యాసంస్థల్లో ఏఐ విప్లవం - 80 వేల మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ

తెలంగాణలోని టీఎంఆర్ఈఐఎస్ విద్యాసంస్థల్లో చదువుతున్న 80 వేల మంది మైనారిటీ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఏఐ రెడీనెస్, డిజిటల్ సేఫ్టీ కార్యక్రమాన్ని ప్రకటించింది. మాస్క్ నెక్స్ట్‌జెన్ - డాక్సా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

Published on: Jul 10, 2026 10:25 PM IST
Advertisement

భవిష్యత్తు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తూ, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థుల కోసం భారీ సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) పరిధిలోని 205 పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న దాదాపు 80 వేల మంది విద్యార్థులకు కృత్రిమ మేధ , డిజిటల్ సేఫ్టీ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

మైనారిటీ విద్యాసంస్థల్లో ఏఐ విప్లవం
మైనారిటీ విద్యాసంస్థల్లో ఏఐ విప్లవం

ఈ వినూత్న ప్రాజెక్టును టీఎంఆర్ఈఐఎస్, మాస్క్ నెక్స్ట్‌జెన్ ,డాక్సా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (DCPL) సంస్థలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలోకి తీసుకువస్తున్నాయి. ఇందులో గ్లోబల్ ఇంప్లిమెంటేషన్, స్ట్రాటజిక్ పార్ట్నర్‌గా డాక్సా కన్సల్టింగ్ సంస్థ బాధ్యతలు నిర్వర్తించనుంది.

ఆగస్టు 15న ప్రారంభం….

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం 2026 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత సానుకూలమైన అంశం ఏమిటంటే,….దీనివల్ల ప్రభుత్వంపై కానీ, అటు విద్యార్థులపై కానీ ఎలాంటి ఆర్థిక భారం పడదు. సామాజిక బాధ్యతతో కూడిన ఉమ్మడి భాగస్వామ్య విధానంలో భాగంగా ఈ శిక్షణను విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.

మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందుకోవడంలో మన విద్యార్థులు ముందంజలో ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

"కృత్రిమ మేధస్సు అనేది కేవలం ఒక సాంకేతికత కాదు, అది మన భవిష్యత్తు. ప్రపంచాన్ని అత్యంత వేగంగా మారుస్తున్న ఈ ఏఐ విప్లవంలో మైనారిటీ విద్యార్థులు వెనుకబడిపోకూడదనే ఉద్దేశంతోనే టీఎంఆర్ఈఐఎస్ సంస్థల్లో ఈ డిజిటల్ సేఫ్టీ శిక్షణను ప్రవేశపెడుతున్నాం" అని మంత్రి అజహరుద్దీన్ పేర్కొన్నారు.

ఈ విద్యా కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు సమాన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మహిళా సాధికారత సాధించాలన్నా, యువతుల ఉపాధి రేటు పెరగాలన్నా సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని మంత్రి అజహరుద్దీన్ అభిప్రాయపడ్డారు. మన బాలికలు అత్యుత్తమ డిజిటల్ విద్యను అభ్యసించి, ఆత్మవిశ్వాసంతో పరిశ్రమల్లో రాణించేలా మార్గం సుగమం చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటని ఆయన స్పష్టం చేశారు.

గేమిఫైడ్ విధానంలో ఆధునిక పాఠ్యాంశాలు

ఈ శిక్షణను సరికొత్తగా, విద్యార్థులను ఆకట్టుకునేలా 'గేమిఫైడ్' మరియు స్వీయ-అభ్యాస (Self-learning) డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా బోధించనున్నారు. కేవలం ఏఐ మాత్రమే కాకుండా, డిజిటల్ భద్రత, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్‌షిప్ క్వాలిటీస్, ఇన్నోవేషన్ వంటి ఇంటరాక్టివ్ మాడ్యూల్స్ ఇందులో ఉంటాయి. దీనివల్ల విద్యార్థులు ఇంటర్నెట్ ప్రపంచంలో సురక్షితంగా ఉంటూనే, కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలను సులువుగా నేర్చుకోగలుగుతారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe