హైదరాబాద్‌లో రౌడీషీటర్ల పైశాచికత్వం.. బాలికకు గంజాయి తాగించి అత్యాచారం!

హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. రౌడీషీటర్లు బాలికకు గంజాయి తాగించి అత్యాచారం చేశారు.

Published on: Feb 19, 2026 10:25 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికకు గంజాయి తాగించి అత్యాచారం చేశారు రౌడీషీటర్లు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ముగ్గురు రౌడీషీటర్లు పరారీలో ఉన్నారు. వారికోసం కోసం పోలీసుల గాలింపు చేస్తున్నారు.

బాలికపై అత్యాచారం
బాలికపై అత్యాచారం

బాలిక పూర్తిగా మత్తులోకి వెళ్లిన తర్వాత ఈ దారుణం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే బాలిక చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి వెళ్లినట్టుగా పోలీసులు అంటున్నారు. బాలిక నార్సింగిలో నానమ్మతో నివసిస్తోంది. నార్సింగి పోలీస్ స్టేషన్‌ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదైంది. బాధితురాలు నెక్నంపూర్ డివిజన్ పాషా కాలనీకి చెందినట్టుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భారీగా గంజాయి పట్టివేత

ఇటీవల కొల్లూరు పోలీసులు, శేరిలింగంపల్లి స్పెషల్ ఆపరేషన్స్ టీం(SOT) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు మాదకద్రవ్యాల వ్యాపారులను అరెస్టు చేశారు. రూ.25.72 లక్షల విలువైన 101.711 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను విజయనగరం జిల్లాకు చెందిన బస్వ జగన్నాథం(37), ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి జిల్లాకు చెందిన పల్లపు లక్ష్మీనారాయణ (52) గా గుర్తించారు. వారి వద్ద నుండి నాలుగు మొబైల్ ఫోన్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని చిత్రకొండకు చెందిన రాజు అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

గంజాయికి బానిసైన నిర్మాణ కార్మికులను నిందితులు లక్ష్యంగా చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. సరఫరాదారు సుమారు 10 రోజుల క్రితం సరుకును డెలివరీ చేశారు. ఆ తర్వాత పెడ్లర్లు దానిని నిర్మాణ ప్రదేశాలలో విక్రయించే ఉద్దేశ్యంతో లేబర్ క్యాంపుల సమీపంలోని తెల్లాపూర్ గ్రామానికి తరలించారు.

కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు.. వాటిని పంపిణీ చేయడానికి ముందే ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 లక్షలకుపైగా విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రాజు కోసం గాలింపు చేపడుతున్నారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని డయల్ 100, సైబరాబాద్ NDPS ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ లేదా అధికారిక వాట్సాప్ హెల్ప్‌లైన్ ద్వారా పంచుకోవాలని పోలీసులు తెలిపారు. సమాచారం ఇచ్చేవారి గుర్తింపు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. వాట్సాప్ నెంబర్ 9490617444కు ఫిర్యాదు చేయవచ్చు.