...
...
Next Story

Kacheguda-Bikaner Express : కాచిగూడ-బికనీర్ ఎక్స్‌ప్రెస్.. శ్రీగంగానగర్ వరకు పొడిగింపు!

Kacheguda-Bikaner Express : రైల్వే ప్రయాణికులకు కాచిగూడ-బికనీర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును పొడిగించారు అధికారులు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

Published on: Mar 20, 2026, 10:00:16 IST
Advertisement

కాచిగూడ-బికనీర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును శ్రీగంగానగర్ వరకు పొడిగించినట్టుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ మార్పుతో మార్చి 21 నుంచి జూలై 7వ తేదీ వరకు అమలులో ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

బికనీర్ నుంచి శ్రీగంగా నగర్ మార్గంలో లాల్‌ఘర్, సూరత్‌గత్, రాయ్‌సింగ్ నగర్, శ్రీకరణ్‌పూర్ స్టేషన్లలో ఈ రైలుకు హాల్ట్ కల్పించింది రైల్వే శాఖ. కాచిగూడ, బికనీర్ నడుమ స్టేషన్లలో ఇరువైపులా టైమింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదని అధికారులు స్పష్టం చేశారు.

రెగ్యులర్ రైళ్లు

మరోవైపు ఎర్నాకులం జంక్షన్-వేలాంకన్ని-ఎర్నాకులం జంక్షన్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-ట్యుటికోరిన్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రెగ్యులర్‌గా మారాయి. ఎర్నాకులం జంక్షన్-వేలాంకన్ని వీక్లీ ఎక్స్‌ప్రెస్ (16363) సాధారణ సేవలు మార్చి 18 నుండి ప్రారంభమయ్యాయి. అలాగే వేలాంకన్ని-ఎర్నాకులం జంక్షన్ ఎక్స్‌ప్రెస్ (16364) సాధారణ సేవలు మార్చి 19న మొదలయ్యాయి. ఎర్నాకులం జంక్షన్-వేలాంకన్ని వీక్లీ ఎక్స్‌ప్రెస్ (16363) బుధవారం రాత్రి 11:50 గంటలకు ఎర్నాకులం జంక్షన్ నుండి బయలుదేరి, గురువారం సాయంత్రం 5:35 గంటలకు వేలాంకన్ని చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వేలాంకన్ని-ఎర్నాకులం జంక్షన్ ఎక్స్‌ప్రెస్ (16364) గురువారం రాత్రి 7:45 గంటలకు వేలాంకన్ని నుండి బయలుదేరి, శుక్రవారం ఉదయం 11:55 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది.

ఇక హైదరాబాద్-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ సాధారణ సేవలు హైదరాబాద్ నుండి ఏప్రిల్ 1 నుండి, కన్యాకుమారి నుండి ఏప్రిల్ 3 నుండి అమల్లోకి వస్తాయి. హైదరాబాద్-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ (17069) బుధవారం సాయంత్రం 4:45 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి, శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17070) శుక్రవారం ఉదయం 5:15 గంటలకు కన్యాకుమారి నుండి బయలుదేరి, శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe