Hyderabad Regional Ring Rail : హైదరాబాద్ రీజినల్ రింగ్ రైలు.. కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్
Hyderabad Regional Ring Rail : హైదరాబాద్ రీజినల్ రింగ్ రైలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
హైదరాబాద్ చుట్టూ ప్రతిపాదిత రీజినల్ రింగ్ రైలు కోసం కేంద్ర ప్రభుత్వం సర్వేకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు, సమీప జిల్లాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు.. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖలో ఆమోదం గురించి తెలియజేశారు. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీకి ఈ సర్వే మొదటి అడుగు కానుంది. రీజినల్ రింగ్ రోడ్డు వెంటే ఈ రైల్వే అలైన్మెంట్ను ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కేంద్రమంత్రి వెల్లడించారు.
డీపీఆర్ సిద్ధమైన తర్వాత ప్రాజెక్ట్ మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వ, ఇతర వాటాదారులతో చర్చలు జరపాల్సి ఉంది. ఆ తర్వాత నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖల నుంచి తుది అనుమతులు, వ్యయ అంచనాల ఆమోదం పొందాలి. ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలోనే ఉన్నందున, ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి అవుతుందనే విషయంపై క్లారిటీగా చెప్పలేమని కేంద్రమంత్రి రవనీత్ స్పష్టం చేశారు.
రైల్వే లైన్ను ఎక్కువగా రీజినల్ రింగ్ రోడ్డు కారిడార్ వెంట ఉంచాలని అధికారులు యోచిస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న రైల్ కనెక్టివిటీ ప్రాజెక్టుకు ఈ సర్వే ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతిపాదిత నెట్వర్క్ కోసం డీపీఆర్ను సిద్ధం చేయడానికి ఈ సర్వే అధికారులకు సహాయపడుతుందని వివరించారు.
డీపీఆర్ పూర్తి చేసిన తర్వాతే కేంద్రం తదుపరి చర్యలు తీసుకుంటుంది. రవనీత్ సింగ్ ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం, కేంద్రంతో సహా కీలక వాటాదారులతో సంప్రదింపులు జరుపుతుంది. ఆ తర్వాత అధికారులు ఈ ప్రతిపాదనను నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు అంచనా కోసం పంపుతారు. చివరగా ఈ ప్రాజెక్టుకు అధికారిక ఆమోదం ఇవ్వడాన్ని కేంద్రం పరిశీలిస్తుంది.
ప్రాజెక్ట్ ప్రాంతీయ కనెక్టివిటీని పెంచుతుందని భావిస్తున్నారు. లోక్సభలో రూల్ 377 కింద భువనగిరి ఎంపీ లేవనెత్తిన అంశంపై కేంద్రమంత్రి రవనీత్ స్పందిస్తూ ఈ అప్డేట్ పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలకు కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ ఆర్థిక వృద్ధి, అభివృద్ధికి తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


