విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్.. సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు!

తెలంగాణలో సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మెుదలైంది. అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.

Published on: May 31, 2026, 21:30:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విదేశీ విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణకు చెందిన మైనారిటీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. హైదరాబాద్‌లోని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం 'ముఖ్యమంత్రి విదేశీ విద్యా నిధి పథకం (Chief Minister's Overseas Scholarship Scheme) - స్ప్రింగ్ సీజన్ 2026' కింద అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు
సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు

ఈ పథకం కింద విదేశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG), పీహెచ్‌డి (Ph.D) వంటి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం గుర్తించిన దేశాలలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్ పొందిన వారికి ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది: అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, సౌత్ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్‌లో చదువుకోవచ్చు.

లభించే ఆర్థిక సహాయం ఎంత?

ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం తరఫున భారీ ఆర్థిక సాయం అందుతుంది. స్కాలర్‌షిప్ మొత్తం గరిష్టంగా రూ. 20 లక్షల వరకు ఆర్థిక సహాయం మంజూరు చేస్తారు. విదేశాలకు వెళ్లేందుకు వన్-వే విమాన టికెట్ ఛార్జీల కింద గరిష్టంగా రూ. 60,000 వరకు అదనంగా అందజేస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ: జూన్ 01, 2026 (01.06.2026)
  • దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 30, 2026 (30.06.2026) సాయంత్రం 5:00 గంటల వరకు.

ఈ స్ప్రింగ్ సీజన్-2026 నోటిఫికేషన్ అనేది కేవలం జనవరి 01, 2026 నుండి జూన్ 30, 2026 మధ్య కాలంలో విదేశీ విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం కేటాయించిన అధికారిక వెబ్‌సైట్ www.telanganaepass.cgg.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది.

  • దరఖాస్తుదారులు తమ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు సంబంధించిన ఒరిజినల్ ట్రాన్స్క్రిప్ట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తయిన తర్వాత, సంబంధిత ఫైళ్లను సమర్పించడానికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా స్వయంగా జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయాలకు హాజరుకావలసి ఉంటుంది.

నకిలీ సర్టిఫికెట్లు ఉంటే క్రిమినల్ చర్యలు

అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ ఎవరైనా తప్పుడు సమాచారంతో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలితే, వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ బి.షఫివుల్లా పేర్కొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More