తెలంగాణ వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉపరితల వాతావరణంలో ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాల తీవ్ర ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. అక్కడికక్కడ ఈదురుగాలులతో కూడిన వానలు పడుతుండటంతో వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ, పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే 24 నుండి 48 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను తరహా మేఘాల కలయిక వల్ల ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షం పడనుంది.
గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాజధాని హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ వర్షాలకు కారణమైన క్యుములోనింబస్ మేఘాలు చాలా నిలువుగా, భారీ ఎత్తులో రూపుదిద్దుకుంటాయి. వీటిని సాధారణంగా తుఫాను మేఘాలు అని పిలుస్తారు. ఇవి నేల మట్టానికి దగ్గరగా మొదలై వేల అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ మేఘాల వల్ల హఠాత్తుగా కుండపోత వర్షం పడటం, వర్షంతో పాటు తీవ్రమైన ఉరుములు, మెరుపులు, గాలులు వీచే అవకాశం ఉంటుంది.
వర్షాలు, ఉరుములతో కూడిన ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో పెద్ద చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదు. ఆరుబయట ఉండే కరెంట్ వైర్లు, విరిగిపడిన విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి.
సజ్జనార్ విజ్ఞప్తి
{{/usCountry}}వర్షాలు, ఉరుములతో కూడిన ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో పెద్ద చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదు. ఆరుబయట ఉండే కరెంట్ వైర్లు, విరిగిపడిన విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి.
సజ్జనార్ విజ్ఞప్తి
{{/usCountry}}హైదరాబాద్ ప్రజలకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. నగరంలో సోమవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దన్నారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని, బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగే లోపే పనులను త్వరగా ముగించుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలన్నారు.
'ముఖ్యంగా నీరు నిలిచిన రహదారులు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణాలు చేయడం అస్సలు సురక్షితం కాదు. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలి.' అని సజ్జనార్ అన్నారు.