Mulugu Bogatha Waterfalls : తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన ములుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బొగత జలపాతం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలపాతం నిండుకుండను తలపిస్తూ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.

సాధారణ రోజుల్లో ఆహ్లాదకరంగా కనిపించే బొగత… ప్రస్తుతం ఉగ్రరూపం దాల్చింది. భారీగా వరద ప్రవాహం తరలి వస్తోంది. జలపాతం ఉధృతి ఎంత తీవ్రంగా ఉందంటే…. పర్యాటకుల రక్షణ కోసం సమీపంలో ఏర్పాటు చేసిన రక్షణ వలయం (సేఫ్టీ కారిడార్) కూడా పూర్తిగా నీట మునిగిపోయింది.
పర్యాటకులకు నో ఎంట్రీ…
జలపాతం వద్ద నెలకొన్న తాజా పరిస్థితులను పర్యవేక్షిస్తున్న అటవీ శాఖ, పోలీసు అధికారులు తక్షణమే స్పందించారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జలపాత సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటకులు ఎవరూ జలపాతం వైపు రాకూడదని…. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పరిసర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే… బొగత జలపాతం చూసేందుకు చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్తుంటారు. ములుగు జిల్లాల్లోని పచ్చని అడవి అందాలను వీక్షిస్తూ…. ఈ ప్రయాణం చేస్తుంటారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, భద్రాచలం, ములుగు నుంచే కాకుండా వేర్వురు ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు తరలివస్తుంటారు. ప్రతి ఏటా ఈ జలపాతం అందాలను వీక్షిస్తుంటారు.
అయితే ఈ జలపాతంలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంటే వెంటనే సందర్శనలపై ఆంక్షలు విధిస్తారు. ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగానే ప్రస్తుతం వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో… తాత్కాలికంగా సందర్శనలు నిలిపివేశారు. వరద ఉద్ధృతి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే పర్యాటకులను అనుమతిస్తారు.
{{/usCountry}}అయితే ఈ జలపాతంలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంటే వెంటనే సందర్శనలపై ఆంక్షలు విధిస్తారు. ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగానే ప్రస్తుతం వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో… తాత్కాలికంగా సందర్శనలు నిలిపివేశారు. వరద ఉద్ధృతి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే పర్యాటకులను అనుమతిస్తారు.
{{/usCountry}}