...
...
Next Story

హైదరాబాద్ : ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ కోసం మినీ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ - జ‌ల‌మండలి కసరత్తు..!

ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ కోసం మినీ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భవిష్యత్ సీవరేజ్ అవసరాలకు తగ్గట్లుగా ప్రణాళిక రూపొందించాలని సూచిస్తూ… పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

Published on: Jan 31, 2026 04:08 PM IST
Advertisement

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నానక్ రామ్ గూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో సీవరేజ్ సిస్టమ్ ను మెరుగుపరిచేందుకు హైదరాబాద్ జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంక్ మెయిన్లను అభివృద్ధి చేయడానికి మినీ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

మినీ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ రూపొందిచండి - జలమండలి ఎండీ

ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ కోసం మినీ సీవరేజ్ మాస్టర్ ప్లాన్
ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ కోసం మినీ సీవరేజ్ మాస్టర్ ప్లాన్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో గచ్చిబౌలి, నానక్ రాం గూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలను ఎండీ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఉత్పన్నం అవుతున్న మురుగు, ఇప్పటివరకు ఉన్న సీవరేజ్ లైన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తు అవసరాలను బట్టి సీవరేజ్ లైన్లను, ట్రంక్ మెయిన్ల అభివృద్ధికి మినీ సీవరేజ్ ప్లాన్ లను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న నాలాలు, వాననీటి కాలువలు, ట్రంక్ మెయిన్ల వివరాలను సేకరించి అధ్యయనం చేయాలని సూచించారు.

మూసీ , ఇతర సమీప చెరువుల్లో మురుగు చేరి కలుషితం కాకుండా వర్షపు నీటి కాలువల నుంచి మురుగునీటి పైపు లైన్లను వేరుచేయాలని ఎండీ అశోక్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. 2047 మాస్టర్ ప్లాన్ ఆధారంగా సీవరేజ్ ట్రంక్ మెయిన్ల, సబ్ సీవరేజ్ లైన్ల నిర్మాణంకోసం ప్రతిపాదనను సమర్పించాలని అన్నారు. ఇందుకోసం ఓ అండ్ ఎం, ఎస్టీపీ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. దీంతోపాటు నానక్ రామ్ గూడ ఎస్టీపీ క్యాచ్ మెంట్ ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యే మురుగును అంచనావేసి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎస్టీపీ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్టీపీ విభాగ అధికారులకు సూచించారు.

నానక్ రాం గూడలోని 4.5 ఎమ్మెల్డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సందర్శించారు. మురుగుశుద్ధి ప్రక్రియను పరిశీలించిన ఎండీ..ఎస్టీపీ సామర్థ్యం, శుద్ధి నీటి నాణ్యత తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీప ప్రాంతాల్లోని ఉత్పన్నమయ్యే మురుగును ఈ ఎస్టీపీలో శుద్ధి చేసే సామర్థ్యం ఉందా..? లేకుంటే సామర్థ్యం పెంచడానికి, కొత్త ఎస్టీపీ నిర్మించడానికి సాధ్యసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

నానక్ రాంగూడ ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటిని గోల్ఫ్ కోర్టులో వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అందుకు ఓఆర్ఆర్ వెంట శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడానికి పైప్ లైన్ నిర్మించడానికి డీపీఆర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పైప్ లైన్ తో ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న గార్డెనింగ్ కి శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడానికి సంబంధించిన అధికారులతో మాట్లాడాలని చెప్పారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe